కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో అన్లాక్ చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 19 తరువాత ఆంక్షలన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తోంది బోరిస్ సర్కార్. గత ఏడాదిగా కాలంగా కరోనా మహమ్మారితో విలవిల్లాడిన యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పుట్టాక పలు వేరియంట్లతో వణికిన బ్రిటన్లో.. ఇప్పుడు కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్నింటిని ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా…
కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వలనే కరోనా రక్కసి కోరల నుంచి దేశాలు బయటపడుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు బ్రిటన్ లో అత్యధిక కాలం లాక్డౌన్ ను అమలు చేశారు. జులై 19 తరువాత ఆంక్షలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మాస్క్ వాడకం విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. Read: బన్నీకి…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక మనదేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిటన్లోని లండన్ విశ్వవిద్యాలయం కీలకమైన పరిశోధన చేసింది. వ్యాక్సన్ మొదటి, రెండో డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే శరీరంలో యాంటీబాడీలు సమర్ధవంతంగా పెరుగుతాయనే దానిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన…
కరోనా అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా వైరస్లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఇప్పుడు లాంబ్డా వేరియంట్ ప్రజలను భయపెడుతున్నది. అయితే, ఈ వేరియంట్ మొదట పెరూ దేశంలో బయటపడింది. పెరూలో వచ్చిన కేసుల్లో 80 శాతం ఈ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వేరియంట్ చిలీ, ఈక్వెడార్, అర్జెంటైనాతో సహా 29 దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు బ్రిటన్లో ఈ కేసులు బయటపడుతున్నాయి.…
కరోనా మహమ్మారి బారిన పడి కోలుకోవడమే కష్టంగా మారిన సమయంలో ఓ పెద్దాయన ఏకంగా 42 సార్లు కరోనా బారిన పడ్డారు. 42 సార్లు ఆయకు పరీక్షల్లో పాజిటీవ్గా తేలింది. వైద్యులు సైతం చేతులెత్తేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆయన హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆ వ్యక్తికి 2019లో కీమోథెరపీ చేయడంతో రోగనిరోధక శక్తి మరింత తగ్గింది. ఆ తరువాత 2020 మార్చి నెలలో మొదటిసారి కరోనా సోకింది. ఏప్రిల్నెలలో ఆయన ఆసుపత్రిలో…
కరోనా కేసులు ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి ఉత్పరివర్తనం చెంది వివిధ వేరియంట్లుగా మారుతున్నది. ఇలా మారిన వాటిల్లో డెల్టా వేరియంట్ భౌగోళిక ముప్పుగా అవతరించింది. సెకండ్ వేవ్ సమయంలో ఈ వేరియంట్ పెద్ద సునామిని సృష్టించింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇండియా బయటపడుతున్నది. ఇప్పుడు డెల్టా వేరియంట్ యూరప్ ను భయపెడుతున్నది. బ్రిటన్లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 35 వేలకు పైగా కేసులు…
బ్రిటన్లో జీ7 దేశాల సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. అమెరికా, బ్రిటన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా సదస్సులో పాల్గోన్న అనంతరం ఇరు దేశాల అధిపతులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోసం ప్రత్యేక బహుమతిని తీసుకొచ్చారు. పూర్తిగా చేత్తో తయారు చేసిన సైకిల్ను ఆయనకు బహుకరించారు. ఈ సైకిల్పై బ్రిటన్ జెండా గుర్తు ఉంటుంది. పూర్తిగా చేత్తో తయారు చేసిన ఈ సైకిల్ ఖరీదు…
జీ7 దేశాలకు చైనా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని, ఊహాన్లోని ల్యాబ్ నుంచి ఈ మహమ్మారి బయటకు వచ్చిందని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. అప్పట్లో ట్రంప్ చేసిన ఆరోపణలను ప్రపంచం పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ చేసిన ఆరోపణలకు బలం చేరూరుతున్నది. ప్రస్తుత అధ్యక్షకుడు జో బైడెన్ కూడా చైనాపై ఉక్కుపాదం మోపేందుకు జీ 7 సదస్సును వేదికగా చేసుకున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు…
బ్రిటన్లో ఈనెల 21 నుంచి లాక్డౌన్లో సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్లో బయటపడిన వేరియంట్లు తగ్గుముఖంపట్టగా, ఇప్పుడు ఆ దేశాన్ని డెల్టా వేరియంట్ భయపెడుతున్నది. సెకండ్వేవ్ సమయంలో ఇండియాను వణికించిన వేరింయంట్ ఇప్పుడు బ్రిటన్లో విజృంభిస్తోంది. డెల్టావేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంపై ఆ దేశం ఆంధోళన చెందుతున్నట్టు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం వాయిదా పడే అవకాశం ఉన్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది. బ్రిటన్లో మరో నాలుగు…