జగన్ పాలనలో కడప ఉక్కు పరిశ్రమను ఒక్క శాతం కూడా అభవృద్ధి చెందలేదని అనకాపల్లి బీజేపీ ఎంపీ రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి కావాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమ పురోగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తామని ఎంపీ రమేష్ వ్యాఖ్యానించారు. గడిచిన ఐదేళ్లు జగన్ సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారు.. పురపాలికల్లో ఎలాంటి అభివృద్ధి లేదని, సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో…
వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఒకరు కోడి గుడ్ల మీద ఈకలు పీకుతాడన్నారు. మచిలీపట్నం లో అత్యధిక మెజారిటీ తో నిన్ను, నీ కుమారుడిని ఓడించారని, ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారన్నారు బుద్దా వెంకన్న. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల…
గుంటూరు జిల్లాలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్ దాస్ మాట్లాడుతూ.. పాండవులు నడయాడిన అమరావతి ప్రాంతంలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టారన్నారు. భవిష్యత్తు తరాలకోసం ఓ విజన్ తో తలపెట్టిన అమరావతి నిర్మాణానికి వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా అని ఆయన తెలిపారు. ధర్మరాజు అడుగుజాడల్లోనే…
పల్నాడు జిల్లాలో మరొకసారి మంత్రి నారాయణ పర్యటించుకున్నారు ….పిడుగురాళ్ల ప్రాంతంలో డయేరియా ప్రభలి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రెండు రోజుల క్రితం పలనాడు ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు ….అక్కడ తీసుకుంటున్న చర్యలతో పాటు, తీసుకోవలసిన చర్యలపై కూడా అధికారులకు నిజానిర్దేశం చేశారు… అయినప్పటికీ డయేరియా అదుపులోకి రాకపోవడంతో, నేడు మరొకసారి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించనున్నారు మంత్రి… నిన్న ఒక్కరోజే 21 కేసులు నమోదవడంతో ప్రభుత్వం…
గుంటూరు జిల్లా కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదని, మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందన్నారు. మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందుకు రావాలన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం…
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఏపీ-తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది. పండగల సమయంలోనేతై…
నేడు ముంబైకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొననున్నారు. అంతకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంత శేష ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నిశ్చితార్థాల అనంతరం ప్రజలతో మమేకమై వారి అభ్యర్థనలను స్వీకరించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయానికి సీఎం…
ఏపీలో ఆరోగ్య శ్రీ ట్రస్టుకు గతంలో ఉన్న ‘నందమూరి తారక రామారావు వైద్య సేవ’ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా మార్చింది. ఆరోగ్యశ్రీ అనునది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి…
ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. కానీ.. ఇది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అయితే ఈ జీపీఎస్కు సంబంధించిన ఫైల్పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ ఫైల్స్పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్లో జీపీఎస్కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట.…
Earth Quake in Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, ఈరోజు మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో…