రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి కాలేజియేట్, టెక్నికల్, ఇంటర్మీడియట్ విద్యా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు/ పాలిటెక్నిక్లు/లో పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GORt. నం. 118) తెలిపింది. ప్రతి కొత్త జిల్లాలు/జోన్/మల్టీ జోన్ కోసం ఆన్లైన్ వెబ్…
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో షాక్లో ఆ పార్టీ ఎమ్మెల్యే జి. మహిపాల్ రెడ్డి సోమవారం అధికార కాంగ్రెస్లో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే ఎ. రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మంత్రులు దామోదర రాజనరసింహ, పి.శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు మారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన కాంగ్రెస్ మాజీ నేత గాలి అనిల్కుమార్ కూడా తిరిగి…
రుణమాఫీ 2018లో అవలంబించిన విధానాలే 2024 లో కూడా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అప్పుడు 2018 రుణ మాఫీ క్రింద 20 వేల కోట్లు ప్రకటించి , 2023 ఎన్నికల సంవత్సరలో 13 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులో 1400 కోట్లు వెనక్కి వచ్చిన కూడా కనీస స్పందన లేని ప్రబుద్ధులు ఈ రోజు మైకుల ముందుకి వచ్చి మాట్లాడటం విడ్డురంగా ఉందని మంత్రి తుమ్మల అన్నారు.…
ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని ఆయన విమర్శించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి…
పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో… రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రెజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే…
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రుణమాఫీ మార్గదర్శకాల పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి కండిషన్ లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఈరోజు ఇన్ని కండిషన్స్ ఎందుకు.? అని ఆయన అన్నారు. రీ షెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని, చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు…
మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే ప్రతి పేదవాడికి 5లక్షలతో డబుల్ బెడ్ ఇల్లు…
నిన్న తెలంగాణ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం పేరిట కల్లు గీత కార్మికులకు కిట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌడన్నల పట్ల సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ప్రవర్తించాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గంటల తరబడి గౌడన్నలను చెట్ల మీద ఉంచడం సరికాదన్నారు. Gauri Krishna:…
కేసీఆర్ వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. సుప్రీంకోర్టులో ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్పై రేపు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. జస్టిస్ నర్సింహారెడ్డి రెడ్డి కమిషన్ సమన్ల పై జూలై 1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో సవాలు చేశారు కేసీఆర్. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి…
విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. 20 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి విడుదల 11 వేల డీఎస్సీ పోస్టులు వేసామని, మరో ఆరు నెలల్లో మిగిలిన పోస్టులకు భర్తీకి డీఎస్సీ వేస్తామని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, డీఎస్సీ వాయిదా పడకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నందుకు ప్రభుత్వం సిద్ధంగా…