రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి…
రేవంత్ కు పరిపాలన చేత కావడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాం వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడ్ పల్లి లైబ్రరీ లో మోకాళ్ళ మీద నిలబడి నిరుద్యోగుల దగ్గర ఓట్లు అడిగారన్నారు. రేవంత్ కి జాబ్ క్యాలెండర్ దొరకలేదా? అని ఆయన ప్రశ్నించారు. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ లు చేస్తున్నారని, ఏటా 3 నుంచి 5శాతం ఉద్యోగులు రిటైర్డు అవుతారని…
విజయనగరం జిల్లాలో నెలల పాపపై తాతయ్య అత్యాచారం కలకలం రేపింది. ఘోర ఘటనపై ప్రతి స్పందిస్తూ ఆ కామాధుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని అరెస్టు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలస గ్రామంలో ఏడు నెలల పసికందు పై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రి కి బాడంగి సిహెచ్సీకి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. ప్రాధమిక…
పోలవరం 50 ఏళ్లలో పూర్తి కాదని మేము రాజశేఖర్ రెడ్డికి చెప్పామని సీపీఎం పొలిటీబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రాజకీయాల్లో ఎవరున్న దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని బీవీ రాఘవులు. ప్రాజెక్టులో మనుష్యులకు మొదటి ప్రాధాన్యత, నీటికీ రెండో ప్రాధాన్యత, ప్రాజెక్టు మూడో ప్రాధాన్యత వుండాలన్నారు బీవీ రాఘవులు. గిరిజనులను మనుష్యులుగా చూడడం లేదని, పట్టిసీమ కాలువలకు పోయిన భూములకు భూమికి భూమి ఇస్తూ 38లక్షలు ఇచ్చిన వాళ్ళు గిరిజనులకు ముష్టి వేస్తున్నారన్నారు బీవీ రాఘవులు.…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. కొటిపిలో రూ.4 కోట్ల విలువతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోందన్నారు. మున్ముందు శాఖలో జరిగిన అక్రమాలు అన్ని బయటకు వస్తాయని, వ్తెసీపీలో వ్యవస్థలన్నింటిని నాశనం చేశారన్నారు బాలకృష్ణ. ఇసుక , మద్యం , మ్తెనింగ్ లలో…
ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సభా నిర్వహణ విషయంలో కీలకాంశాలను యమమల రామకృష్ణుడు ప్రస్తావించారు. పూర్తి స్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి వాటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యనమల రామకృష్ణుడు సలహాలు ఇచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మాట్లాడుతూ.. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుంది. గడువు ముగిసేలోగా బడ్దెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్…
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు నిన్న రాత్రి నుంచి మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గాఘాట్ నుంచి దేవస్ధానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకవైపు ఆదివారం సెలవు రోజు కావడంతో దుర్గమ్మ…
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి లో బాలిక ఘటనలో సస్పెన్స్ వీడటం లేదు. ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 7వ రోజు గాలింపు కొనసాగతోంది. 7వ తేదీన బాలిక(9) అదృశ్యమైంది. పోలీసుల అదుపులో మైనర్ బాలులు, తల్లిదండ్రులు ఉన్నారు. అయితే.. నాలుగు రోజుల క్రితం కాలువలో మృతదేహాన్ని పడేశామన్న మైనర్ బాలురు. రెండు రోజుల క్రితమేమో గ్రామ సమీపంలోని స్మశానంలో పడేశామని తెలిపారు. తాజాగా బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని మైనర్…
పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో దారుణం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు, ఆమె కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించారు ముద్దా శ్రీను అనే వ్యక్తి.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో ఈపూరు మండలం, ముప్పాళ్ళకు చెందిన ముద్ద శ్రీను గడిచిన మూడు సంవత్సరాలుగా హైదరాబాదులో సహజీవనం చేస్తున్నాడు. అయితే.. ముద్ద శ్రీను వల్ల గర్భం రావడంతో తనను పెళ్లి చేసుకోమని మహిళ ఒత్తిడి చేసింది. దీంతో మహిళ తో పాటు ఆమె కొడుకును అడ్డు…
పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయం వేదికగా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రోజూ ఒకరిద్దరు మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న టీడీపీ అధినేత సూచించారు. కార్యకర్తలు.. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత దూషణలకు.. భౌతిక దాడులకు దిగకుండా సంయమనం పాటించాలన్న టీడీపీ అధినేత… వైసీపీ…