ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని,…
ఈరోజు NDSA చైర్మన్, అధికారులతో మాట్లాడినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న ఢిల్లీలో NDSA కమిటీతో సమావేశం ఉంటుందని, వర్షాల నేపథ్యంలో డ్యామ్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 18 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల ఇంట్రెస్ట్…
ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని…
ఈనెల 18న రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అన్ని మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదిక వద్ద సంబరాలు జరుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హోదాలో రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయబోతున్నారని, లక్ష రూపాయలు ఒకసారి… ఆగస్టులో మిగతా రుణమాఫీ చేయాలని ప్రభుత్వ నిర్ణయమన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కుటుంబ నిర్దారణ కోసమే రేషన్ కార్డు అడిగామని, గత రెండు సార్లు చేసినట్లుగానే రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. అంతేకాకుండా.. పాత…
కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్దరించాలని, బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి.. క్రిమినల్స్ తో కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.…
సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నదని, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు మధుయాష్కీ. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం అని ఆయన ప్రశ్నించారు. పది ఏండ్లలో 80 వేల కోట్ల అవినీతి చేశారని, గతంలోనే విద్యుత్…
తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద 31 అంశాలు పెండింగులో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో అనేక శాఖలకు సంబంధించినవి ఉన్నాయని, రెసిడెంట్ కమిషనర్ను కలిసి వివరాలు తెలుసుకున్నానని ఆయన తెలిపారు. పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు కేంద్రాన్ని కలిసి మాట్లాడారని, మేం కూడా మా వంతుగా ఈ పెండింగ్ అంశాలపై కేంద్రంతో చర్చిస్తామన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. పెండింగ్ అంశాలపై రాష్ట్రానికి చెందిన అన్ని…
పంట రుణాల మాఫీకి రైతులకు రేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన మరుసటి రోజు, రూ.2 లక్షల పంట రుణమాఫీని అమలు చేయడానికి భూ పాస్బుక్ ఉపయోగించబడుతుంది అని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. రైతులకు పథకం. సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు ఉపయోగించబడుతుంది. చాలా మందికి రేషన్కార్డులు లేకపోవడంతో రేషన్కార్డును తప్పనిసరి చేస్తే చాలా…
ప్రోటోకాల్ గురించి కేటీఆర్.. హరీష్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్.. హరీష్ ల అనుభవం చాలా చిన్నది.. వాళ్ల వయస్సు చిన్నదని, ఎంపీ గా రేవంత్ ఉన్నప్పుడు ఆయన నియోజక వర్గంలో ప్రోటోకాల్ పాటించారా కేటీఆర్.. హరీష్ ఎప్పుడైనా..? అని ఆయన ప్రశ్నించారు. మీరు ప్రోటోకాల్ పాటించకుండా.. ఇప్పుడు సిఎం రేవంత్ నీ ప్రోటోకాల్ గురించి అడగడంలో అర్థం లేదని, సంగారెడ్డి లో…
వైద్యారోగ్య శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీలపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర అసంతృప్తికి లోనైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో నెలకొన్న సందిగ్ధతపై పెద్ద సంఖ్యలో వైద్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, ప్రభుత్వ వైద్యులకు, ప్రత్యేకించి దశాబ్దాలుగా పరిధీయ ప్రాంతాల్లో (పట్టణ కేంద్రాలకు దూరంగా) తమ విధులను నిర్వర్తిస్తున్న వారికి, పట్టణ కేంద్రాల్లోని వారితో సమానంగా చికిత్స అందేలా సరైన మార్గదర్శకాలు లేవు. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి , బదిలీ…