Home
Breaking News
Breaking News News
-
తెలంగాణ ప్రజలకు షాక్.. మళ్లీ పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా రూ.4,500 కోట్ల రాబడికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. Read Also: శరవేగంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. 4 రోజుల్లో 45 అటు స్థలాల విలువను 35 శాతం,… -
యూనియన్ బడ్జెట్లో రూ.7,778 కోట్లు కేటాయించాలని తెలంగాణ కోరింది : కేటీఆర్
రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా రాబోయే యూనియన్ బడ్జెట్లో రూ.7,778 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కేపీహెచ్ బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (MRTS), మెట్రో నియో నెట్వర్క్తో సహా పలు ప్రాజెక్టులకు నిధులు కోరారు. స్ట్రాటజిక్… -
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానున్నది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొనబడిన ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు చిన జీయర్ స్వామీజీ ఆశ్రమం ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నగర శివార్లలోని 45 ఎకరాల కాంప్లెక్స్ వద్ద, రూ. 1,000 కోట్ల ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడింది.… -
శరవేగంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. 4 రోజుల్లో 45..
నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. మొత్తంగా గత నాలుగు… -
షాకింగ్ : భర్త తలను నరికి.. ఆ భార్య ఎంతపనిచేసిందో..
నేటి సమాజంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు గొడవపడి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇది.. భర్త తలను భార్య విచక్షణ రహితంగా నరికి చంపినా ఘటన ఏపీలోని రేణుగుంటలో చోటుచేసుకుంది. గురువారం రేణిగుంటలోని ఓ మహిళ తన భర్త తలను నరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది. పోలీస్ లైన్స్ రోడ్డులో రవిచంద్రన్ (53), వసుంధర అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి… -
కేరళలో కాంప్రమైజ్ కానంటున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులో తెలుసా..?
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను తీవ్రం చేయడమే కాకుండా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ కేరళలో మాత్రం కరోనా కాంప్రమైజ్ కానంటోంది. తాజాగా… -
ఏపీ, తెలంగాణలో మిర్చి పంట దారుణంగా దెబ్బతింది : జీవీఎల్ నరసింహారావు
దేశంలో మిర్చి ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 60 శాతమని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 40 శాతమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. “తామర తెగులు” కారణంగా ఏపీ తెలంగాణలో మిర్చి పంట దారుణంగా దెబ్బతిందని, ఆంధ్రప్రదేశ్ లో మిర్చి పంట సాగు 2 లక్షల హెక్టార్లకు పైగా ఉందన్నారు. తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా పంట సాగు జరిగిందని, 25 మంది శాస్త్రవేత్తలు, పంట నిపుణులతో… -
దమ్ముంటే దేశమంతా దళిత బంధు అమలు చేయించాలి : మంత్రి కొప్పుల
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో అయన నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అదానీ, అంబానీల చేతుల్లో పెట్టిన ఘనత బీజేపీకే దక్కిందని ఆయన విమర్శించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే భారతదేశమంతా దళిత బంధు అమలు చేయించాలని మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని… -
స్వతంత్ర పోరాటంలో మహిళల త్యాగం మరవలేనిది : మోడీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్రను గుర్తుచేసుకున్నారు. దేశం కోసం అనేక మంది మహిళలు త్యాగాలు చేశారని వారి త్యాగం మరువలేనిదని మోడీ కొనియాడారు. “ప్రపంచం ప్రతికూల అంధకారంలో మునిగిపోయినప్పుడు, స్త్రీల గురించి ఆలోచిస్తూ భారతదేశం మాతృమూర్తిని దేవత రూపంలో ఆరాధించేది. సమాజానికి విజ్ఞానాన్ని అందించే గార్గి, మైత్రేయి, అనుసూయ, అరుంధతి మరియు మదాల్సా వంటి పండితులు మనకు ఉన్నారు” అని ఈరోజు… -
ఉద్యోగ సంఘాలు సంయమనంతో ఆలోచించాలి : పేర్ని నాని
ఏపీలో పీఆర్సీ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోలు ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేవంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సమ్మె సైరన్ మోగించేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎవరి ప్రోద్బలంతో నో, భావోద్వేగంతోనో కాకుండా సంయమనంతో ఆలోచించాలని కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగుల పట్ల సానుభూతి ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27…
తాజావార్తలు
-
Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
-
Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!
-
Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
-
INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై.. బయటకొచ్చినట్లు ప్రకటన