Pakistan Airstrikes: ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి..19 మంది మృతి
- ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి
- 19 మంది మృతి
- తెహ్రిక్-ఇ-తాలిబాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ వైమానిక దాడుల్లో అనేక మంది మరణించినట్లు సమాచారం. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు శిబిరాలపై సైన్యం ఇంటలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఆదివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ “X”లో ప్రకటించారు.
Also Read:Harish Rao: మెదక్లో గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
సరిహద్దు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్-అఫ్లియేటెడ్ గ్రూప్ పై కూడా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నంగర్హార్ ప్రావిన్స్లోని ఖోగ్యాని జిల్లాలో పాకిస్తాన్ జెట్లు అనేక వైమానిక దాడులు నిర్వహించాయి. పక్తికాలోని బర్మల్, అర్గున్ జిల్లాలతో పాటు నంగర్హార్లోని ఖోగ్యాని, బహ్సోద్, ఘని ఖేల్ జిల్లాల్లో అనేక వైమానిక దాడులు జరిగాయి. పాకిస్తాన్ దాడులు జరిగిన ఖచ్చితమైన స్థానాన్ని పేర్కొననప్పటికీ, సోషల్ మీడియా నివేదికలు ఈ దాడులు ఆఫ్ఘనిస్తాన్ లోనే జరిగాయని పేర్కొన్నాయి. దాడులకు సంబంధించి ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ఒక మదర్సాపై దాడి చేసిందని, దాడుల్లో 19 మంది పౌరులు మరణించారని ఆఫ్ఘన్ ప్రభుత్వం పేర్కొంది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేసింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!