చైనా అణ్వాయుధాలపై ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వీఫెంగే కీలక ప్రకటన చేశారు. కొత్త తరహా అణ్వాయుధాల అభివృద్ధిలో చైనా ఎంతో ప్రగతి సాధించినట్టు వీఫెంగే వెల్లడించారు. అయితే.. అణ్వాయుధాలను చైనా తన స్వీయ రక్షణ కోసమే ఉపయోగిస్తుందని వీఫెంగే వ్యాఖ్యానించారు. అంతేకానీ, ముందుగా చైనా అణ్వస్త్రాలను ప్రయోగించదని స్పష్టం చేశారు వీఫెంగే. చైనా తూర్పు భాగంలో గతేడాది 100కు పైగా అణు క్షిపణీ ప్రయోగ కేంద్రాలను నిర్మించినట్టు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా.. చైనా రక్షణ…
దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన చిన్నారు అందులో పడి నరకయాతన అనుభవిస్తూ మృత్యువాతపడుతున్నారు. అయితే తాజాగా.. ఛత్తీస్గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 80 అడుగుల లోతు బోరు బావిలో రాహుల్ అనే 11 ఏళ్ల బాలుడు పడిపోయాడు. రాహుల్ ను కాపాడేందుకు గుజరాత్ కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగింది. మాట్లాడలేని, వినలేని…
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ఫ్లిక్స్ తన గేమింగ్ సర్వీస్ కోసం కొత్త గేమ్లను ప్రకటించింది, అవి ‘ది క్వీన్స్ గాంబిట్,’ ‘షాడో అండ్ బోన్,’ ‘టూ హాట్ టు హ్యాండిల్’ మరియు ‘మనీ హీస్ట్’ వంటి కొన్ని ప్రసిద్ధ టీవీ షోలతో ముడిపడి ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ప్రస్తుతం 22 గేమ్లను అందిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 50 టైటిల్స్ను కలిగి ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ వారం ‘గీక్డ్ వీక్’ ఈవెంట్లో, కంపెనీ రాబోయే గేమ్ల…
ఇటలీలో ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు మృతిచెందారు. అయితే మృతుల్లో నలుగురు టర్కీకి చెందినవారు కాగా.. ఇద్దరు లెబనీస్ పౌరులు. గురవారం ఓ ప్రవేట్ చాపర్ ఉత్తర-మధ్య ఇటలీలో దట్టమైన అడవులు, పర్వతప్రాంతంలోకి వెళ్లాక అదృశ్యమైంది. ఈ క్రమంలో రాడార్ సంబంధాలు తెగిపోవడంతో.. గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే శనివారం ఉదయం ఓ పర్వతారోహకుడు హెలికాప్టర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి…
మాజీ బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందల్లు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా.. ముస్లిం దేశాలలో కూడా ఆగ్రహజ్వాలలు రగిల్చిన సంగతి తెలిసిందే. అయితే.. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన, అల్లర్లకు పాల్పడ్డారు. అయితే దీని వెనుక ప్రధాన సూత్రధారి అయిన మహమ్మద్ జావెద్ అలియాస్ జావెద్ పంప్కు ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ నోటీసు జారీ చేసింది. శుక్రవారం పట్టణంలో…
అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. క్రమంగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ కాగా, 5,24,761 మంది మరణించారు. మరో 44,513 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.…
తీగ లాగితే డొంక కదిలిందే అనే సామెత మనం వినే ఉంటాం. అలాంటి సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఏప్రిల్లో మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో కొందరు దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేసి పరారయ్యారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. అయితే.. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011…
మానవాళికి జంతువులకు వీడిదీయలేని అనుంబంధం ఉంది. సింహం లాంటి మాంసాహార జంతువులు సైతం మనుషుల మధ్య పెరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీడియోలు మనం చూస్తునే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులలో ఉన్న మేథాశక్తి బయటపడుతుంటుంది. వాటి మేథాశక్తి ముందు కొన్ని సార్లు మనుషులు మెదడు తక్కువే అనిపిస్తుంటుంది. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఓ ఎలుగుబంటి చేసిన పని అలాంటిది మరీ.. ఓ ఎలుగుబంటి పడిపోయిన ట్రాఫిక్ కోన్ కనిపించగానే సరిచేసి వెళ్లిన…
న్యూఢిల్లీలో కోరల్ బాగ్లోని గఫార్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఇది గమనించిన స్థానికులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 39 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు…
మద్యం సేవించి వాహనాలు నడిపడంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ముమ్మాటికీ మద్యం సేవించి వాహనం నడపడం తప్పేనని కోర్టులు, పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తునప్పటికీ కొందురు మందుబాబులు మాత్రం మారడం లేదు. అయితే.. ఏపీలో ఓ వ్యక్తి దాదాపు పూటుగా తాగి బైక్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి పోలీసులుకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరు సీఐ గోవిందరాజు కథనం ప్రకారం.. గుడివాడ సమీపంలోని వెంట్రప్రగడకు చెందిన…