నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్లోని తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు చేసుకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్మోనాక్సైడ్ బాటిల్ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే.. అనంతరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు…
జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మొదటి రోజు విచారణ ముగిసింది. అయితే పోలీసుల కస్టడీ విచారణ కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారించారు. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై ఒకరు నెట్టుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గ్యాంగ్ రేప్ కేసులో తమ తప్పు…
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 8 ఏళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. చిత్తశద్ధి ఉంటే అర్హులైన భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మూడు సంవత్సరాలలో గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని సవాల్విసిరారు. గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు ప్రభుత్వ భూమి ఉండగా 45…
నేటి సమాజంలో అనాలోచిత నిర్ణయాలతో చేసే పనులు చివరికి జీవితంలో అంధకారాన్ని మిగుల్చుతాయి. పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్న భర్తను పనికి పొమ్మంటే.. ఏకంగా ఇల్లాలి ప్రాణాన్ని తీశాడో దుర్మార్గుడు. అంతేకాకుండా ఆతరువాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో విభోర్ సాహు అనే వ్యక్తి డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే 15 రోజులుగా అతడు పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవడం…
మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్కు చెల్లిగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు.. ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాలు కూడా చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించారు. ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ…
మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబ తాటాకు తప్పుళ్ళకు భయపడమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడిగా కేసీఆర్ ఊహించుకుంటున్నాడని, ఫాంహౌస్ లో కూర్చుని కేసీఆర్ కంటోన్న కలలు కల్లలుగా మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు.. దేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీని కేసీఆర్ పొగుడుతాడని ఎవరు అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వ…
అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశ దేశాల్లో భయానక వాతావరణాన్ని కరోనా మహమ్మారి సృష్టించింది. కరోనాతో ప్రత్యక్షంగా కొంతమంది దెబ్బతింటే.. మరి కొంత మంది పరోక్షంగా దెబ్బతిన్నారు. మొత్తానికి కరోనా వైరస్ దెబ్బకు మానవుల జీవితాలలో కరోనా కాలాన్ని ఒక విషాద సమయంగా అభివర్ణిస్తున్నారు. అయితే.. అయితే కరోనా వైరస్ సోకిన వారిపై తాజాగా చేసిన పరిశోధనల్లో కొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, పనితీరు మార్పులు…
కన్నడ నటి అయిన రమ్య నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అభిమన్యు సినిమాలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రమ్య. కన్నడ, తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె సినిమాలకు గుడ్బై చెప్పి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది. ప్రస్తుతం రమ్య సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె…
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రహస్యంగా తన బాయ్ఫ్రెండ్ సామ్ అస్ఘరిని పెళ్లి చేసుకుంది. అయితే తన పెళ్లి వేడుక లాస్ ఏంజిల్స్లో బ్రిట్నీ స్పియర్స్ చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అడ్డుకునేందుకు స్పియర్స్ మాజీ భర్త అలెగ్జాండర్ విఫలయత్నం చేశాడు. 2004లో జేసన్ అలెగ్జాండర్ను బ్రిట్నీ పెళ్లాడింది. కానీ ఆ జంట కేవలం 55 గంటలు మాత్రమే కలిసి ఉండటం గమనార్హం. గతంలో కూడా బ్రిట్నీ స్పియర్స్ పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో.. అలెగ్జాండర్ అడ్డుకునేందుకు…
రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. కొత్త కొత్త స్మార్టఫోన్ కంపెనీలు రంగంలోకి దిగి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే విదేశీ కంపెనీ మొబైల్స్ అమ్మకాల్లో భారత్లో ఓ ఊపు ఊపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొ కొత్త స్మార్ట్ఫోన్ కంపెనీ భారత విపణిలోకి అడుగుపెట్టబోతోంది. లండన్కు చెందిన ‘నథింగ్’ కంపెనీ తన తొలి మొబైల్ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై నేతృత్వంలోని నథింగ్ లండన్లో వర్చువల్ ఈవెంట్ ద్వారా…