అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఈటల రాజేందర్లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్, 15 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు…
Tragedy : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే విధి మండలంలోని చింతపల్లి క్యాంపు గ్రామం సోమవారం ఉదయం భయానక ఘటనకు వేదికైంది. కుటుంబ కలహం ఉద్ధృతంగా మారి, చివరికి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యతో జరిగిన ఘర్షణతో ఆగ్రహానికి గురైన భర్త, జోక్యం చేసుకున్న తన ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. DRDO : భారత్-పాక్ యుద్ధంలో హైదరాబాద్ డీఆర్డీవో కీలక పాత్ర హత్యకు గురైన…
Big Breaking : భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ ఘటనలో F-17S జెట్ను కూడా కూల్చివేసినట్లు సమాచారం అందుతోంది. వివరాల ప్రకారం, పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక F-16ను భారత బలగాలు మధ్యలోనే గుర్తించి అడ్డుకున్నాయి. క్షణాల్లో స్పందించిన భారత సైనికులు…
Earthquake: తెలంగాణలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ఈ భూ ప్రకంపనలు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల సుల్తానాబాద్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారంలో కూడా భూమి కనిపించినట్లు తెలుస్తోంది. భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్థి,…
Hyderabad: హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న కొత్త నిర్ణయాలు, వాటి వివరాలను సీపీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ ను 35 సంవత్సరాల తర్వాత జి.ఓ.ఎం.ఎస్. నెం. 32, (హోం లీగల్ డిపార్ట్మెంట్) ద్వారా తేది 30.04.2023 నాడు పోలీసు పునః వ్యవస్థీకరణ చేయడానికి ఉత్తర్వులు చేసారు. ఈ జి.ఓ. ప్రకారం రెండు అదనపు లా అండ్ ఆర్డర్ జోన్లు (సౌత్ ఈస్ట్ + సౌత్ వెస్ట్), 11…
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కులగలను చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, భారత్ జోడో లో చెప్పిన మాట ప్రకారం కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీ తీర్మానం చేశామని. ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ విజయం అమలులోకి వచ్చిందని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ…
పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్కు కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదంపూర్లోని బసంత్గఢ్లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఇరు వైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఉధంపూర్లోని డూడులో జరుగుతోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో…
KPHB Mur*der: ఈ మధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల భర్తలను భార్యలు వివిధ రకాలుగా చంపేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో భర్తను చంపి పాతిపెట్టిన కేసులో పోలీసులు ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే కేసును చేదించారు. నిందితులు కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా కేపీహెచ్బీ…