CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కులగలను చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, భారత్ జోడో లో చెప్పిన మాట ప్రకారం కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీ తీర్మానం చేశామని. ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ విజయం అమలులోకి వచ్చిందని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని, కులగణన చేయాలని కేంద్ర నిర్ణయించడానికి స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయమై సీఎం ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: మంత్రి చేతుల మీదుగా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం..!
అలాగే జాతీయ జనగణన లో కుల గణన చేర్చడం తెలంగాణ ప్రభుత్వ విజయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి పంపింది. కేంద్ర ప్రభుత్వం బీసీ లకు తెలంగాణ లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశామని ఆయన తెలిపారు. కుల గణన చేసి తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని, ఇప్పుడే కేంద్ర ప్రభుత్వ జన గణన ద్వారా జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామని ప్రకటించింది. ఇది తెలంగాణ ప్రభుత్వ, ప్రజల విజయమని ఆయన అన్నారు. 1931లో బ్రిటిష్ కాలంలో జాతీయ స్థాయిలో కుల గణన జరిగిందని.., ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయం సహకరించిన ముఖ్యమంత్రికి ,ఉప ముఖ్యమంత్రికి సహచర మంత్రులకు, పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ఆలస్యమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని, రాబోయే జన గణన లో కుల గణన చేస్తామని చెప్పడం బలహీన వర్గాల మంత్రిగా మీకు అభినందనలు కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు.