Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 150 అడుగుల లోతైన లోయలో పడ్డ కారు.. ఎనిమిది మందిమృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో మంగళవారం (జులై 15) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also:Handri Neeva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పనులు పూర్తి.. ఎల్లుండి నీటిని విడుదల చేయనున్న సీఎం..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, గాయపడిన వారిని లోయలో నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అదుపు తప్పినదేనన్న అనుమానంతో విచారణ చేస్తున్నారు.
Read Also:Maoists : 30 ఏళ్ల అజ్ఞాతానికి ముగింపు.. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
ఈ సంఘటన పిథోరాగఢ్ జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. టాక్సీ లోయలో పడిపోయిన వెంటనే ఘటనా స్థలంలో పెద్దేత్తున్న కేకలు వినిపించాయని సమాచారం. దీనితో స్థానిక గ్రామస్తులు, పోలీసుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. పిథోరాగఢ్ జిల్లాలోని మువానీ ప్రాంతంలో వాహనం ప్రమాదానికి గురైన వార్త చాలా బాధాకరం. ఈ ఘటనలో మరణించినవారికి నా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మలు శాంతించాలి. వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందించేందుకు అధికారులను ఆదేశించాను అని తెలిపారు.
Horrific accident in Pithoragarh, Uttarakhand, Car falls into gorge, 8 dead. On Tuesday evening, a Max vehicle went out of control and fell into a 150 meter deep gorge in Pithoragarh district, in which 8 people died on the spot. pic.twitter.com/qLilHhTknI
— Ashraph Dhuddy (@ashraphdhuddy) July 15, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!