Gang Rape: బీచ్లో ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం..10 మంది అరెస్ట్
- గోపాల్పూర్ బీచ్ లో ఈ దారుణ ఘటన
- ప్రియుడితో కలిసి బీచ్కు వెళ్లిన యువతి
- అక్కడే యువతిపై సామూహిక అత్యాచారం
- ప్రియుడిని బంధించి అతడి ముందే దుశ్చర్య
- పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
READ MORE: CM Chandrababu: కుప్పం బాధితురాలికి చంద్రబాబు ఫోన్.. ఆర్థికసాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్..
Also Read
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
గోపాల్పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తాను, తన ప్రియుడితో కలిసి బీచ్లోని ఏకాంత ప్రదేశంలో కూర్చున్నప్పుడు 10 మంది వ్యక్తులు తమ వద్దకు వచ్చారు. వారు తన ప్రియుడిని చుట్టుముట్టి చేతులు, కాళ్లను కట్టివేశారు. దీని తర్వాత.. వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. కాగా.. ఈ ఘటన అనంతరం నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.
READ MORE: CM Revanth Reddy: గో సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
ఈ అంశంపై ఎస్పీ శరవణ వివేక్ ఎం మాట్లాడుతూ.. “బాధిత యువతిపై ముగ్గురు వ్యక్తులు వరుసగా అత్యాచారం చేశారు. మరో ఏడుగురు వారికి భద్రత కల్పించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశాం. నిందితుల్లో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. వారు ఈ దారుణమైన నేరంలో పాల్గొన్నందున వారిని మేజర్లుగా పరిగణించాలని పోలీసులు కోర్టును అభ్యర్థిస్తారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాం” అని తెలిపారు.
తాజావార్తలు
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!