CM Revanth Reddy: వికారాబాద్ జిల్లా నిన్న సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాల తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్ నియోజకవర్గం సందడి వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుని, అక్కడ జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారు. సీఎం గా రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించడం ఇది మొదటిసారి. ఆయన కొండారెడ్డిపల్లిలో రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించబడిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండ గా ఉంటామని హామీ…
జగిత్యాల జిల్లాలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మధ్య వివాదం ముదిరింది. గతవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మద్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే.. దసరా పండుగా (శమీపూజ) పై అధికారుల వివాదం ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అనాదిగా 100 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారానికి అధికారుల ఇగో వల్ల మంట కలుస్తుందని జగిత్యాల ప్రజల నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక మోతె గ్రామపంచాయతీ ట్రాక్టర్ ని అద్దెకు తీసుకొచ్చారు రెవెన్యూ…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18ను తీసుకొచ్చారని వివరించారు. ఈ సర్వే 60 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణనను పూర్తిగా సేకరించిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ్ పంచాయతీ ఎన్నికలు) జరుగుతాయని స్పష్టత ఇచ్చారు. కులగణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు…
చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగలైన దసరా, దుర్గాపూజలను దేశం జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్లో ఇలా అన్నారు, “అందరికీ ‘విజయదశమి’ శుభాకాంక్షలు. అధర్మం యొక్క చీకటి ఎంత దట్టమైనప్పటికీ, సత్యం ఆధారంగా ధర్మం యొక్క కాంతి విజయం శాశ్వతమైనది. “దానికి ప్రతీక. పాపంపై పుణ్యం సాధించిన ‘విజయదశమి’ అనేది మనల్ని ఎల్లప్పుడూ వివేకం , సత్యం యొక్క…
కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా పనిచేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు పొన్నంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని…
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాథం లతోపాటు నాలుగు జిల్లాల సంబంధించిన మంత్రులు, ఎంపీలు,…
తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఈ కులగణనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం సమగ్ర కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వేను ఇంటింటి కుటుంబాల రిజిస్ట్రేషన్ ద్వారా నిర్వహించనున్నట్లు జీవో విడుదల చేసింది. ఈ సర్వేను ప్రణాళికశాఖకు అప్పగిస్తూ, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Sayaji…
Air India Express Flight: తమిళనాడు తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్యని ఎదుర్కొంది. తాజాగా విమానం తిరుచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.