Mahesh Kumar Goud : మజ్లిస్తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు.. తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్
- కిషన్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడం కరెక్ట్ కాదు
- వాయినాడ్ లాంటి పరిస్థితి మనకు రాకూడదనే ఈ చర్యలు
- అనుకోని సంఘటన జరిగితే.. ఎవ్వరు ఇబ్బంది పడొద్దనే మూపీ నిర్ణయం : మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మజ్లిస్తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు అని, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్ అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త, పాత అంత కలుపుకుని పోతున్నామని ఆయన తెలిపారు. ఏ అంశంలో అయిన ముందు నుండి ఉన్న కాంగ్రెస్ నాయకులకీ ముందు ప్రియారిటీ ఉంటదన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. వాయినాడ్ లాంటి పరిస్థితి మనకు రాకూడదనే.. అనుకోని సంఘటన జరిగితే….ఎవ్వరు ఇబ్బంది పడొద్దనే మూసీ నిర్ణయమన్నారు. మేము మా ప్రభుత్వం మూపీ ప్రక్షాళనకి డీపీఆర్ ఇవ్వలేదన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే వాళ్లకి లాభాలు జరుగుతున్నాయన్నారు. సిసోడియాకి రాని బెయిల్… కవితకి ఎలా వచ్చింది… అందరికి తెలుసు అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎవ్వరిని కించపరచాలని ఉద్దేశంతో కొండా సురేఖ మాట్లాడలేదని, ఎంత కడుపు మంట.. బాధ ఉంటే అలా మాట్లాడుతది అని ఆయన అన్నారు.
Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
అంతేకాకుండా..’కేటీఆర్ ఆమెని అవమానించేలా మాట్లాడితే… మాట్లాడింది.. వ్యక్తి గతంగా ఏం లేదు అని, కొండా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పాను. వెంటనే.. ఉపసంహరించుకున్నారు. మూసీకి లక్షా యాభై కోట్లు అని ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్పలేదు. భవిషత్తు తరాలకు హైదరాబాద్ తీర్చి దిద్దాలా వద్దా బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పాలి. వర్కింగ్ ప్రెసిడెంట్లకు కేబినెట్ కు ఎలాంటి సంబంధం లేదు, హైడ్రా టార్గెట్ పేద ప్రజలు కాదు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన బడా బాబులే టార్గెట్. బీజేపీ బీద ప్రజల విషయంలో మాట్లాడే హక్కు లేదు, బీద ప్రజలకు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో త్వరలో ఇంకొన్ని చేరికలు ఉంటాయి. ఇప్పటికే కొంత మంది బిఅరెస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారు ఉన్నారు. పూర్తి స్థాయిలో జిల్లా పర్యటన తర్వాతే పీసీసి కమిటీలు. 15వ తేదీ రెండు జిల్లాలు,16వ తేదీ రెండు జిల్లాలు పర్యటన చేస్తా. ఎంఐఎంకు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పొత్తు లేదు. కేవలం స్నేహపూర్వక ఒప్పందం మాత్రమే. లా&ఆర్డర్ విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.’ అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
Viral Video: “అది కొండచిలువ.. బల్లిని కాదు గురూ..” బాల్కనీలో పాము కోసం వెతుకుతూ..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!