భద్రాద్రి జిల్లాలోని మణుగూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి. ప్రజా పాలనలో ఉన్నాం. దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. రాష్ట్రంలో 1251 నియోజకవర్గాల్లో కార్పోరేటర్ల తలతన్నెల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనలు చేశామని, అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామన్నారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో 13,500 కోట్లు రెండు…
పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు , విద్యా శాఖ కార్యాలయాల ముట్టడి చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేత వేముల రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల ఫీజు రియంబర్స్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల రాష్ట్ర…
మంత్రి కొండా సురేఖ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న , జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్లను మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్ రావు చేసిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రఘునందన్ రావు తనపై, మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన…
తెలంగాణ రాష్ట్రంలో దుర్గమూల్యాలకు సమర్థంగా స్పందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫోర్స్లో సుమారు 2000 మంది సభ్యులుంటారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, , డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రతిపాదనలపై చర్చించారు. సమాచారంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదలు , లోతట్టు…
ఎర్రమంజిల్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న AEE లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు తెలిపారు. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ప్రభుత్వం పది నెలల పాటు అద్దె చెల్లించకపోవడంతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావుప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అగాధ స్థితికి చేరుకుందనడానికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు. హరీష్ రావుచేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎక్స్ వేదికపై కఠినమైన కౌంటర్ ఇచ్చారు. “గత పదేళ్ల మీ బీఆర్ఎస్…
దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ , కేసీఆర్ కుటుంబం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు ప్రత్యేకంగా గర్వకారణమైన నేవీ రాడార్ స్టేషన్ పై కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ రాడార్ స్టేషన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే జీవోలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అది ఎంత గొప్ప ప్రాజెక్టో, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఒక విధంగా మాట్లాడినా, ప్రతిపక్షంలో…
సైదాబాద్ లోని స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇక్కడ 72 మంది విద్యార్థులు ఉన్నారని, ఇక్కడ బాల నేరస్తులుగా వచ్చినవారిలో పరివర్తన తీసుకొస్తున్నామన్నారు. ఇది శిక్ష కాలం కాదు శిక్షణ కాలమని ఆమె వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వ అబ్జర్వేషన్ ఉన్నంతవరకు వాళ్ళలో మంచి పరివర్తన రావాలని, వాళ్లకి కావాల్సిన ఎడ్యుకేషన్, వృత్తిపరమైన కోర్సులను నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. టాటా టెక్నికల్ సపోర్ట్తో సాంకేతిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామన్నారు మంత్రి…
ఏపీ రాష్ట్రంలో సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలను జరపాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఒకేసారి నిర్వహించనున్నారు, ఇది గ్రామీణ అభివృద్ధికి పెద్ద దోహదం చేసే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ పండుగలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్లతో 30,000 పనులను చేపట్టనుంది. ఇందులో 3,000 కిలోమీటర్ల మేర సీసీ…
ఏపీ రాష్ట్రంలో వరుస తుపానుల కారణంగా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, నదులు, వాంగులు పొంగి పోయాయి, దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతర వర్షాల కారణంగా కొన్ని ప్రాణాలు పోయాయి, రైతులు పంటలు నష్టపోయారు. ఇప్పుడే ఆ నష్టాల నుంచి తేరుకోకముందే, మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…