బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్…
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అబూజ్ మద్ తో పాటు దండకారణ్యం ప్రాంతాల్లో మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుని పడుతున్నప్పటికీ మరోవైపున మావోయిస్టు పార్టీ తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంది తాజాగా దండకారణ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమీకరణ అయ్యారు. పలు గ్రామాల గిరిజనుల ను ఒక చోటికి చేర్చి మావోయిస్టు వారోత్సవాలని నిర్వహించారు.. అమరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పనిచేసిన రామకృష్ణ తో పాటు డప్పు రమేష్ ,నర్మద…
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని, కానీ, ఒక్క హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని, 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్మెంట్…
అక్టోబర్ 23 నుంచి 27 వరకు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా జరగనుంది. అయితే.. 23వ తేదీన నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ స్వదేశీ మేళాలో 500 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉండనున్నాయి. ప్రతి రోజు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ట్రైనింగ్ అండ్ లెక్చర్ ప్రోగ్ర్సాం ప్రతి రోజూ నిర్వహించనున్నారు. అయితే.. ఈ స్వదేశీ మేళా కోసం..…
ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్ల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. వానకాలం సీజన్లో మండలంలో 10.15 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. 3.96 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంట సాగులో ఆదిలాబాద్ అగ్రస్థానంలో ఉండగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 3.30 లక్షల ఎకరాల్లో సాగైంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరుసగా 1.47 లక్షలు, 1.42 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఆదిలాబాద్…
మహిళ మీద ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు తెగ మాట్లాడుతున్నాడని, గత పదేళ్లలో మహిళలను అన్ని రకాలు అణచివేసింది కేసీఆర్ కాదా..? కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా నియంత్రుత్వ పోకడలు పోయింది మీరు కాదా..? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వయం సహాయక గ్రూపు లను నిర్వీర్యం చేయ లేదా..? పావలా వడ్డీ రుణాలు ఎత్తి వేసి మహిళలకు అన్యాయం చేయ లేదా…? మహిళల కోసం…
తెలంగాణలో ప్రభుత్వంలో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మార్పుల ప్రకారం, పలువురు సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా, ప్రభుత్వం నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారుల స్థానాలు భర్తీ చేయడానికి ఇన్చార్జులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఈ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో రిలీవైన IASల అధికారుల స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమ్రపాలి స్థానంలో GHMC కమిషనర్గా ఇలంబర్తి, వాకాటి కరుణ స్థానంలో…
నిమ్స్లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి మరో ఘనత నిమ్స్ ఖాతాలో చేరింది. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సర్జరీలు చేశారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బందిని మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. 10 నెలల్లోనే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసిన ప్రభుత్వ దవాఖానగా నిమ్స్ హాస్పిటల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకూ 101 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు…
దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సదస్సుకు జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి టెలికాం కంపెనీలు హాజరయ్యాయని, దాదాపు 33 దేశాల కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ దేశాల నుంచి బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించారని, అనేక టెలికాం కంపెనీలకు సంబంధించిన సంస్థల…
ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్ రావు మండిపడ్డారు.…