చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబ డి ఉన్న పరువు కాస్తా.. బజార్లో పడేసి.. కటకటాల పాలైన యువకుల చీకటి బాగోతం. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి వసంతనగర్…
ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల లో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలినవారుగా ఉండడం, అదేవిధంగా ఆ గంజాయి తరలించే…
మూసీ ప్రక్షాళన పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని, నోట్ల రద్దు సమయంలో మోడీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.…
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల్లో పడడం ఏమిటని…
రెస్టారెంట్ల పరిస్థితి ఇప్పుడు పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారింది. బయటకి చూస్తే క్లాసీగా కనిపిస్తున్నా, వంటగది పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. భోజన ప్రియుల దృష్టిని దూరంగా ఉంచి, నాలుగు మొక్కలు, కొత్త పంథాలను ఉపయోగించి యాంబియెన్స్ను మెరుగుపరుస్తున్నారు. కస్టమర్లు హోటళ్ల వంటగదిని పరిశీలించరు కనుక, వారు ఏది అందించినా తింటారు అని భావిస్తున్నాయి రెస్టారెంట్ యాజమాన్యాలు. ముఖ్యంగా హైదరాబాద్లో, విభిన్న ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. వీకెండ్ వచ్చేసరికి, ఇంట్లో వండడం కన్నా రెస్టారెంట్ల…
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్…
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అబూజ్ మద్ తో పాటు దండకారణ్యం ప్రాంతాల్లో మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుని పడుతున్నప్పటికీ మరోవైపున మావోయిస్టు పార్టీ తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంది తాజాగా దండకారణ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమీకరణ అయ్యారు. పలు గ్రామాల గిరిజనుల ను ఒక చోటికి చేర్చి మావోయిస్టు వారోత్సవాలని నిర్వహించారు.. అమరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పనిచేసిన రామకృష్ణ తో పాటు డప్పు రమేష్ ,నర్మద…
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని, కానీ, ఒక్క హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని, 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్మెంట్…
అక్టోబర్ 23 నుంచి 27 వరకు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా జరగనుంది. అయితే.. 23వ తేదీన నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ స్వదేశీ మేళాలో 500 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉండనున్నాయి. ప్రతి రోజు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ట్రైనింగ్ అండ్ లెక్చర్ ప్రోగ్ర్సాం ప్రతి రోజూ నిర్వహించనున్నారు. అయితే.. ఈ స్వదేశీ మేళా కోసం..…
ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్ల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. వానకాలం సీజన్లో మండలంలో 10.15 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. 3.96 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంట సాగులో ఆదిలాబాద్ అగ్రస్థానంలో ఉండగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 3.30 లక్షల ఎకరాల్లో సాగైంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరుసగా 1.47 లక్షలు, 1.42 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఆదిలాబాద్…