దక్షిణాదిలో తెలంగాణలో కూడా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ అగ్రనాయకత్వం.. రాష్ట్రంపై అన్నిరకాల ఎఫర్ట్స్ పెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది గోల్. ఆపై లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడున్న నాలుగు సీట్లే కాకుండా మరిన్నిచోట్ల పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలు తరచుగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్కు ప్రధాని మోడీ వచ్చారు. ఆయన నగరంలో ఉన్నది కొద్ది గంటలే అయినప్పటికీ.. అందులో పార్టీకి కూడా సమయం కేటాయించారు. రాష్ట్రంలో…
తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నేరవేరతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ అమర వీరులను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నమైందని ఆవేదన…
రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి. కొద్దిపాటి అధికార గణం.. కళాకారుల సమక్షంలో వేడుకలను నిర్వహించింది రాజ్భవన్. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. ఒక సహోదరిని కూడా. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. రాజ్ భవన్ స్కూల్ లో భోజన సౌకర్యం కల్పించామని అన్నారు. భద్రాచలం, ఖమ్మం ఆదివాసులతో భోజనం చేసి..పౌష్టికాహారం…
తాను కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేయడమే ఆలస్యం.. అతడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడా? అనే చర్చలు జాతీయంగా మొదలైపోయాయి. ఆల్రెడీ గంగూలీ పలుసార్లు కేంద్ర హోంమంత్రిని కలవడం, ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ఆయన రావడంతో.. గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని, ఆయన బీజేపీలో చేరనున్నారని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. అతని చేసిన ట్వీట్లో ‘చాలామందికి ఉపయోగపడే ఓ మహత్తర కార్యక్రమానికి తెరతీస్తున్నా’ అని పేర్కొనడం.. రాజకీయ అరంగేట్ర ప్రచారానికి మరింత…
బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాలకు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర మంత్రులను ఇంచార్జులుగా నియమించింది. రాజస్తాన్ కు ఎన్నికల ఇంచార్జ్ గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను, హర్యానాకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కర్ణాటకకు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కర్ణాటకకు ఇంచార్జులుగా నియమించారు. జూన్ 10…
తెలంగాణలో పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గ్రాామాల్ల పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లిచడం లేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. అయినా సర్పంచులకు బిల్లులను దాదాపుగా క్లియర్ చేశామని, మిగతావి త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రులు చెబుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లవద్దని బీజేపీ పార్టీకి…
కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ లేకుండా అసలు అవార్డులే లేవని. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద దేశంలో 20 గ్రామాలు ప్రకటిస్తే తెలంగాణలోని 19 గ్రామాలకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ బండి సంజయ్ తొండి సంజయ్ అని.. రేవంత్ రెడ్డిది గోబెల్స్ ప్రచారం అని విమర్శించారు. బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్ లో అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వలేదని…
గ్రామాల్లో సర్పంచులు ఆందోళన చేస్తున్నారా..? లేక ఎవరైనా చెప్పి చేయిస్తున్నారా..? తెలియడం లేదని..కొన్ని మీడియా ఛానెళ్లు, వార్తా పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, నిన్నటి వరకు అందరి బిల్లులను క్లియర్ చేశామని వెల్లడించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతి ఈ నెల 3 నుంచి 17 వరకు అన్ని గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉపాధి హామీ పనులు మన రాష్ట్రంలో…
జమ్మూకశ్మీర్లో కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు, హత్యల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కశ్మీరీ పండిట్లు 18 రోజులుగా ధర్నా చేస్తుంటే.. బీజేపీ ఎనిమిదేళ్ల పాలన వేడుకల్లో బిజీగా ఉందని ఆరోపించారు. మంగళవారం కుల్గామ్లో ఉపాధ్యాయురాలు రజనీ బాలాపై కాల్పులు జరుపడంతో ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో రాహుల్ స్పందించారు. ‘లోయలు శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని గారూ, ఇది సినిమా కాదు నిజం. కశ్మీర్లో గత ఐదు…