Sabita Indraredy: బీజేపీ పల్లెప్రగతిని రాంగ్ రూట్లో తీసుకెళ్లొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గ్రాామాల్ల పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లిచడం లేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. అయినా సర్పంచులకు బిల్లులను దాదాపుగా క్లియర్ చేశామని, మిగతావి త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రులు చెబుతున్నారు.
ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లవద్దని బీజేపీ పార్టీకి హితవు పలికారు. ప్రతి దాంట్లో మా వాటా ఉందని చెప్పే బీజేపీ అధ్యక్షుడు.. ఇప్పుడు గ్రామాలకు నిధులు ఇవ్వండంటూ అడగడం ఏంటని ప్రశ్నించారు. ద్వంద్వ నీతితో ఉన్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
Also Read
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఈ నెల 3వ తేదీ నుంచి 15 రోజుల పాటు కొనసాగుతాయని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలసని ఆమె అన్నారు. దేశంలో అత్యుత్తమ సంసద్ గ్రామాలు 10 తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని అన్నారు.
రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు రూ.335 కోట్ల నిధులు విడుదల చేశామని.. ఇంకా రూ. 14 కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జూన్ 3 నుంచి పల్లె ప్రగతిలో భాగంగా బడిబాట కూడా ఉంటుందని తెలిపారు. ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేయబోతున్నామని.. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..