కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లిలో పర్యటించారు. మంత్రి మాల్లారెడ్డితో కలిసి మూడు చింతలపల్లిలో రూ.15 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం, 13.5 లక్షలతో…
నేడు, రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జేపీ నడ్డా ఏపీలోని విజయవాడకు చేరుకున్నారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా గన్నవరం విమానశ్రయానికి చేరుకోగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అయితే విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందని, రాజకీయాల్లో మార్పు కోసం…
ఏపీలో పొత్తులపై వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ.. గతంలో మన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సరిగా పట్టించుకోలేదని, బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన రిప్రజెంటేషన్లను మన మిత్రపక్షంగా ఉన్న వాళ్లు చించేసేవారని ఆమె అన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉందని నాడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే.. మీ బలమెంత..? అని అమిత్ షా ప్రశ్నించారని ఆమె అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం…
బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అంటూ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది బీజీపీ తప్ప దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. మత ప్రబోధకుడిపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాయబారులను పిలిపించి ముస్లిం దేశాలు నిరసన లేఖలు అందించడంతో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించిన…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు తిరుపతి లోక్సభ సీటు గెలిచిన బీజేపీ.. ప్రస్తుతం ఉందా లేదా అన్నట్టుగా మారిపోయింది. జిల్లాలో గుర్తింపు పొందిన కమలనాథులు ఏమైపోయారో అని కేడర్ ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఉంది. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నియోజకవర్గాలను చుట్టేస్తోంది. జనసేన కూడా ఏదో ఒక నిరసనతో జనాల్లో ఉండేందుకు చూస్తోంది. అధికారపార్టీ వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అని ఊరూరా తిరుగుతోంది. ఈ రాజకీయ సందడిలో కనిపించంది బీజేపీ నేతలేనని లోకల్గా చెవులు…
డాక్టర్ కె లక్ష్మణ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా.. అసెంబ్లీలో బీజేపీ పక్ష ఉపనేతగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ పదోన్నతిపై తెలంగాణ బీజేపీ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నా.. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ముషీరాబాద్లో లక్ష్మణ్ను రీప్లేస్ చేసేది ఎవరన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. మొన్నటి వరకు ముషీరాబాద్ అంటే లక్ష్మణ్,.. లక్ష్మణ్ అంటే ముషీరాబాద్ అన్నట్టుగా బీజేపీలో చర్చ ఉండేది. కానీ.. రానున్న రోజుల్లో ముషీరాబాద్…
బండి సంజయ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించిన విషయంతెలిసిందే.. ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి” అని ఆయన ట్విటర్ వేదికగా నిలదీశారు. అయితే ఈ ట్విట్ పై #TRSScared Of BandiSanjay హాష్ ట్యాగ్ పేరుతో కొందరు ట్విటర్ వేదికగా కేటీఆర్ పై విమర్శలు కురుపిస్తున్నారు. సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఉద్యమించే వరకు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై…
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ళపాటు ఆమెను పార్టీ నుంచి బహష్కరిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆమెలాగే ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నవీన్ కుమార్ జిందాల్ని కూడా సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. బీజేపీ ఈ చర్యలకు పూనుకుంది. ఓ టీవీ డిబేట్లో నుపుర్ శర్మ మాట్లాడుతూ.. ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. దీంతో,…
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హైదరాబాద్కు వచ్చిన లక్ష్మణ్కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. యాదాద్రిలో సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండానే దేవాలయ దర్శనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని…
డబుల్ ఇంజన్ సర్కార్ కు మోడల్ ఉత్తర్ ప్రదేశ్ అని అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా లక్ష్మణ్ హైదరాబాద్ రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. యూపీలో 8 మందిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తే అందులో నలుగురు ఓబీసీలు, ఇద్దరు మహిళలు, ఒక దళితుడికి అవకాశం కల్పించి సామాజిక న్యాయం చేశారని లక్ష్మణ్ అన్నారు. ఓబీసీ వర్గాలను బీజేపీ దగ్గర చేస్తా అని అయన అన్నారు. తెలంగాణపై…