ఎగుమతిదారులకు JNPA భారీ ఛార్జీల మినహాయింపు.. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JNPA: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) దేశాలకు వెళ్లాల్సిన ఎగుమతులు నిలిచిపోయి ఆర్థిక భారంతో సతమతమవుతున్న వ్యాపారులకు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) ఊరటనిచ్చింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన ఎగుమతి కంటైనర్ల కోసం భారీగా ఛార్జీల మినహాయింపును ప్రకటించింది. నిలిచిపోయిన కంటైనర్లపై గ్రౌండ్ రెంట్, రీఫర్ ప్లగ్-ఇన్ ఛార్జీలను రద్దు చేస్తూ ట్రేడ్ నోటీసు విడుదల చేసింది.
READ ALSO: Union Cabinet Decisions : అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
Also Read
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ప్రత్యేక చర్యలు ఇవే..
పోర్ట్, టెర్మినల్ ఆపరేటర్లు ఎగుమతి-దిగుమతి (EXIM) రంగానికి వెసులుబాటు కల్పించేందుకు ఈ క్రింది చర్యలు చేపట్టారు.
* స్టోరేజ్ సౌకర్యం: సరుకు రవాణా అయ్యే వరకు నిలిచిపోయిన కంటైనర్లను టెర్మినల్ యార్డుల్లోనే భద్రపరిచే అవకాశం.
* కస్టమ్స్ సంప్రదింపులు: ఇతర పోర్టుల నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లాల్సిన కంటైనర్లను తాత్కాలికంగా JNPA టెర్మినల్స్లో నిల్వ చేసేందుకు కస్టమ్స్ అధికారులతో చర్చలు.
* అదనపు స్థలం: అదనపు సరుకును ఉంచడానికి టెర్మినల్ ఆపరేటర్లకు మరికొంత స్థలాన్ని కేటాయించిన JNPA.
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్న ఎగుమతిదారుల కోసం ప్రకటించిన రాయితీలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 28, 2026 నుంచి మార్చి 8వ తేదీ ఉదయం వరకు టెర్మినల్స్లోకి చేరిన కంటైనర్లపై 15 రోజుల పాటు (మార్చి 14 వరకు) 100% గ్రౌండ్ రెంట్ మినహాయింపు ఇచ్చారు. త్వరగా పాడైపోయే వస్తువులు ఉన్న కంటైనర్ల విద్యుత్ ఛార్జీలలో 80% మినహాయింపు లభిస్తుంది. ఇది కూడా 15 రోజుల పాటు వర్తిస్తుంది. ఈ రాయితీల వల్ల కలిగే ప్రయోజనం నేరుగా అసలు ఎగుమతిదారులకు అందేలా చూడాలని షిప్పింగ్ లైన్లు, ఫ్రైట్ ఫార్వార్డర్లను JNPA ఆదేశించింది. మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ఎదురైన భారాన్ని తగ్గించేందుకు JNPA తీసుకున్న ఈ నిర్ణయం ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Jawaharlal Nehru Port Authority issues Trade Notice |JNPA have decided to offer waiver on charges like ground rent and reefer plug-in charges to the stranded export containers.
The following measures have already being taken by the Port and Terminal Operators to give relief to… pic.twitter.com/6ZLuuoSK0o
— ANI (@ANI) March 10, 2026
READ ALSO: Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
-
Xiaomi FX Mini LED Series: అమెజాన్ ఫైర్ టీవీ ఇంటిగ్రేషన్తో.. షియోమి FX మినీ LED సిరీస్ విడుదలకు సిద్ధం
-
Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
-
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?