Iran War: 9 దేశాల్లో ‘‘ఇంధన సంక్షోభం’’.. లాక్డౌన్ పరిస్థితులు..
- ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’..
- ఇరాన్ యుద్ధ ప్రభావం..
Iran War: మధ్యప్రాచ్యంలోని యుద్ధం ఇతర దేశాలను ‘‘ఇంధన సంక్షోభం’’లోకి నెడుతోంది. భారత్ ఇతర దేశాలతో పోలిస్తే చాలా నయంగా కనిపిస్తోంది. కానీ 9 దేశాలు మాత్రం ఇంధన సంక్షోభంతో అల్లాడుతున్నాయి. కిస్తాన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, పోలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రపంచ సప్లై చైన్ను దెబ్బతీసింది. హార్ముజ్ జలసంధి మూసేయడంతో చమురు ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇంధన సరఫరాలో రేషన్ విధిస్తున్నాయి. పాఠశాల్ని మూసేయడం, ప్రభుత్వా కార్యాలయాలను మూసేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
పొలాండ్, ప్రాన్స్ దేశాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల్లో పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భనం భయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. పోలాండ్లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ఇక్కడ పెట్రోల్ ధరలు వారంలో 14 శాతం పెరిగాయి. ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఇంధన పొడుపును ప్రారంభించాయి.
Also Read
- Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
Read Also: Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్.. ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీల జీతాలు కట్
ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాక్లో పెట్రోల్ ధర లీటర్కు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం రెండు వారాల పాటు పాఠశాలల్ని మూసేసింది. ప్రభుత్వ కార్యాలయాలు వారానికి నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. బంగ్లాదేశ్లో ఇంధన రేషన్ అమలు చేయబడింది. మోటార్ సైకిళ్లకు 2 లీటర్లు మరియు కార్లకు 10 లీటర్ల రోజువారీ పరిమితిని నిర్ణయించారు. భయాందోళనలను నివారించడానికి, పెట్రోల్ పంపుల వద్ద రసీదులను తనిఖీ చేస్తున్నారు.
శ్రీలంకలో ఇంధన ధరలు 8 శాతం పెంపు విధించారు. ఏప్రిల్ వరకు సరిపడా స్టాక్ ఉందని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్ దేశంలో బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో కూడా గ్యాస్ ధరలు పెరిగాయి. ఇండోనేషియా ప్రభుత్వం B50 బయోడీజిల్ ప్రోగ్రామ్ మళ్లీ అమలు చేయాలని ఆలోచిస్తోంది. పామ్ ఆయిల్ ఆధారిత బయోడిజిల్ వాడకాన్ని పెంచి క్రూడ్ ఆయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?