Iran War: 9 దేశాల్లో ‘‘ఇంధన సంక్షోభం’’.. లాక్డౌన్ పరిస్థితులు..
- ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’..
- ఇరాన్ యుద్ధ ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మధ్యప్రాచ్యంలోని యుద్ధం ఇతర దేశాలను ‘‘ఇంధన సంక్షోభం’’లోకి నెడుతోంది. భారత్ ఇతర దేశాలతో పోలిస్తే చాలా నయంగా కనిపిస్తోంది. కానీ 9 దేశాలు మాత్రం ఇంధన సంక్షోభంతో అల్లాడుతున్నాయి. కిస్తాన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, పోలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రపంచ సప్లై చైన్ను దెబ్బతీసింది. హార్ముజ్ జలసంధి మూసేయడంతో చమురు ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇంధన సరఫరాలో రేషన్ విధిస్తున్నాయి. పాఠశాల్ని మూసేయడం, ప్రభుత్వా కార్యాలయాలను మూసేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
పొలాండ్, ప్రాన్స్ దేశాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల్లో పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భనం భయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. పోలాండ్లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ఇక్కడ పెట్రోల్ ధరలు వారంలో 14 శాతం పెరిగాయి. ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఇంధన పొడుపును ప్రారంభించాయి.
Also Read
Read Also: Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్.. ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీల జీతాలు కట్
ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాక్లో పెట్రోల్ ధర లీటర్కు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం రెండు వారాల పాటు పాఠశాలల్ని మూసేసింది. ప్రభుత్వ కార్యాలయాలు వారానికి నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. బంగ్లాదేశ్లో ఇంధన రేషన్ అమలు చేయబడింది. మోటార్ సైకిళ్లకు 2 లీటర్లు మరియు కార్లకు 10 లీటర్ల రోజువారీ పరిమితిని నిర్ణయించారు. భయాందోళనలను నివారించడానికి, పెట్రోల్ పంపుల వద్ద రసీదులను తనిఖీ చేస్తున్నారు.
శ్రీలంకలో ఇంధన ధరలు 8 శాతం పెంపు విధించారు. ఏప్రిల్ వరకు సరిపడా స్టాక్ ఉందని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్ దేశంలో బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో కూడా గ్యాస్ ధరలు పెరిగాయి. ఇండోనేషియా ప్రభుత్వం B50 బయోడీజిల్ ప్రోగ్రామ్ మళ్లీ అమలు చేయాలని ఆలోచిస్తోంది. పామ్ ఆయిల్ ఆధారిత బయోడిజిల్ వాడకాన్ని పెంచి క్రూడ్ ఆయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!