Iran War: 9 దేశాల్లో ‘‘ఇంధన సంక్షోభం’’.. లాక్డౌన్ పరిస్థితులు..
- ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’..
- ఇరాన్ యుద్ధ ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మధ్యప్రాచ్యంలోని యుద్ధం ఇతర దేశాలను ‘‘ఇంధన సంక్షోభం’’లోకి నెడుతోంది. భారత్ ఇతర దేశాలతో పోలిస్తే చాలా నయంగా కనిపిస్తోంది. కానీ 9 దేశాలు మాత్రం ఇంధన సంక్షోభంతో అల్లాడుతున్నాయి. కిస్తాన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, పోలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రపంచ సప్లై చైన్ను దెబ్బతీసింది. హార్ముజ్ జలసంధి మూసేయడంతో చమురు ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇంధన సరఫరాలో రేషన్ విధిస్తున్నాయి. పాఠశాల్ని మూసేయడం, ప్రభుత్వా కార్యాలయాలను మూసేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
పొలాండ్, ప్రాన్స్ దేశాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల్లో పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భనం భయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. పోలాండ్లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ఇక్కడ పెట్రోల్ ధరలు వారంలో 14 శాతం పెరిగాయి. ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఇంధన పొడుపును ప్రారంభించాయి.
Also Read
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
Read Also: Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్.. ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీల జీతాలు కట్
ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాక్లో పెట్రోల్ ధర లీటర్కు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం రెండు వారాల పాటు పాఠశాలల్ని మూసేసింది. ప్రభుత్వ కార్యాలయాలు వారానికి నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. బంగ్లాదేశ్లో ఇంధన రేషన్ అమలు చేయబడింది. మోటార్ సైకిళ్లకు 2 లీటర్లు మరియు కార్లకు 10 లీటర్ల రోజువారీ పరిమితిని నిర్ణయించారు. భయాందోళనలను నివారించడానికి, పెట్రోల్ పంపుల వద్ద రసీదులను తనిఖీ చేస్తున్నారు.
శ్రీలంకలో ఇంధన ధరలు 8 శాతం పెంపు విధించారు. ఏప్రిల్ వరకు సరిపడా స్టాక్ ఉందని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్ దేశంలో బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో కూడా గ్యాస్ ధరలు పెరిగాయి. ఇండోనేషియా ప్రభుత్వం B50 బయోడీజిల్ ప్రోగ్రామ్ మళ్లీ అమలు చేయాలని ఆలోచిస్తోంది. పామ్ ఆయిల్ ఆధారిత బయోడిజిల్ వాడకాన్ని పెంచి క్రూడ్ ఆయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!