Iran War: 9 దేశాల్లో ‘‘ఇంధన సంక్షోభం’’.. లాక్డౌన్ పరిస్థితులు..
- ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’..
- ఇరాన్ యుద్ధ ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మధ్యప్రాచ్యంలోని యుద్ధం ఇతర దేశాలను ‘‘ఇంధన సంక్షోభం’’లోకి నెడుతోంది. భారత్ ఇతర దేశాలతో పోలిస్తే చాలా నయంగా కనిపిస్తోంది. కానీ 9 దేశాలు మాత్రం ఇంధన సంక్షోభంతో అల్లాడుతున్నాయి. కిస్తాన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, పోలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రపంచ సప్లై చైన్ను దెబ్బతీసింది. హార్ముజ్ జలసంధి మూసేయడంతో చమురు ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇంధన సరఫరాలో రేషన్ విధిస్తున్నాయి. పాఠశాల్ని మూసేయడం, ప్రభుత్వా కార్యాలయాలను మూసేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
పొలాండ్, ప్రాన్స్ దేశాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల్లో పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భనం భయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. పోలాండ్లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ఇక్కడ పెట్రోల్ ధరలు వారంలో 14 శాతం పెరిగాయి. ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఇంధన పొడుపును ప్రారంభించాయి.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
Read Also: Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్.. ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీల జీతాలు కట్
ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాక్లో పెట్రోల్ ధర లీటర్కు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం రెండు వారాల పాటు పాఠశాలల్ని మూసేసింది. ప్రభుత్వ కార్యాలయాలు వారానికి నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. బంగ్లాదేశ్లో ఇంధన రేషన్ అమలు చేయబడింది. మోటార్ సైకిళ్లకు 2 లీటర్లు మరియు కార్లకు 10 లీటర్ల రోజువారీ పరిమితిని నిర్ణయించారు. భయాందోళనలను నివారించడానికి, పెట్రోల్ పంపుల వద్ద రసీదులను తనిఖీ చేస్తున్నారు.
శ్రీలంకలో ఇంధన ధరలు 8 శాతం పెంపు విధించారు. ఏప్రిల్ వరకు సరిపడా స్టాక్ ఉందని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్ దేశంలో బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో కూడా గ్యాస్ ధరలు పెరిగాయి. ఇండోనేషియా ప్రభుత్వం B50 బయోడీజిల్ ప్రోగ్రామ్ మళ్లీ అమలు చేయాలని ఆలోచిస్తోంది. పామ్ ఆయిల్ ఆధారిత బయోడిజిల్ వాడకాన్ని పెంచి క్రూడ్ ఆయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!