భద్రాచలం నియోజకవర్గంలో ముంపు గురైన ప్రాంతాలను, నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ముంపు ప్రాంతాల్ని సందర్శించలేదని, వారికి సహాయం అందించలేదని మండిపడ్డారు.
Bhatti Vikramarka: దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని బిజెపి, టీఆర్ఎస్ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చినట్టుగా అమృత ఉత్సవాల పేరిట ప్రచార ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందని సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రూ వారి కుటుంబ సభ్యులైన సోనియా, హుల్ ను బీజేపీ అవమానించడం స్వాతంత్రాన్ని అవమానించినట్లే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని పట్టపగలు…
హైదరాబాద్ లోని ధర్నా ఛౌక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్రంపై మండిపడ్డారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను ఏర్పాటు చేసిందని గుర్తు చేసారు. కళ్ళ ముందే బీజేపీ ఆస్తులను అమ్మేస్తుందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబం బతకాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.…
రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.