దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రజల కలలు నిజమవుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమే ఈ ఎన్నికలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎల్పీ భట్టి విక్రమార్క ప్రసంగించారు.
కార్యకర్తలే తన బలమని.. మధిర నియోజకవర్గ ప్రజలే తన ఊపిరి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చడమే తన ఆశయమని ఆయన వెల్లడించారు.
అధికారంలో ఉన్న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం నడుస్తుంది.. యుద్ధంలో ప్రజలు గెలవాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు.. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లు అని భట్టి విక్రమార్క ప్రకటించారు.
28 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి లక్ష 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి అదనంగా చుక్క నీరు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు.
సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలో బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని రామప్ప దేవాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పూజలు చేసి దేవున్ని వేడుకున్నారని ఆయన వెల్లడించారు.
Congress First List: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలకు అదికూడ సిట్టింగ్ స్థానాలకు అభ్యర్ధిలను కాంగ్రెస్ అధిష్టానం వెల్టడించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉండగా అందులో మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యను అబ్యర్ధులుగా అధిష్టానం ప్రకటించింది.
రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం పీఆర్సీ పెంచడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇదేనా ఉద్యోగులను కడుపులో పెట్టుకునే చూసుకునే విధానమని విమర్శించారు. దేశంలోనే ధనిక రాష్ట్రంలో ఏమిటి దారుణమని ప్రశ్నించారు. వెంటనే 20% ఐఆర్ ప్రకటించాలన్నారు.