Serial Thief: 15 ఏళ్ల పగ.. కేవలం పోలీసులు ఇళ్లను కొల్లగొట్టే దొంగ..
- మధ్యప్రదేశ్లో విచత్ర దొంగ అరెస్ట్..
- పోలీసులు ఇళ్లను కొల్లగొట్టడమే హాబీ..
- 15 ఏళ్ల నాటి పగ తీర్చుకుంటున్న దొంగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Thief: మధ్యప్రదేశ్లో ఒక దొంగ అరెస్ట్ సంచలనంగా మారింది. కేవలం ‘‘పోలీసుల’’ ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఖాండ్వా జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఇళ్లలో దొంగతనం చేస్తున్న అలీరాజ్పూర్ జిల్లాకు చెందిన దీపేష్ అధికారులకు చిక్కాడు. విచిత్రం ఏంటంటే, 15 ఏళ్ల నాటి పగ తీర్చుకునేందుకు దీపేష్ ఇలా పోలీసు అధికారుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నాడని విచారణలో తేలింది. ఇతడి అరెస్ట్ ను జిల్లా పోలీసులు పెద్ద అచీవ్మెంట్గా చెబుతున్నారు.
ఎలా దొరికాడు..?
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
జనవరి 20న ఖండ్వా పోలీస్ లైన్స్లో ఇద్దరు కానిస్టేబుల్స్ కరణ్పాల్ సింగ్, సురేష్ ఖాటే ఇళ్లలో చోరీ జరిగింది. ఆభరనాలు, నగదు సహా లక్షల రూపాయల విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. దీని తర్వాత విచారణ ప్రారంభమైంది. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తిని పోలీసులు నిందితుడిగా గుర్తించి, వెతకడం ప్రారంభించారు. జహబువా, అలీరాజ్పూర్, ధర జిల్లాల్లో్ కూడా పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తరుచుగా ప్రాంతాలు మారుస్తుండటంతో నిందితుడు దీపేష్ను అరెస్ట్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
టెక్నికల్ ట్రాకింగ్ ఆధారంగా బుర్హాన్పూర్ వైపు వెళ్తుండగా నిందితుడి అరెస్ట్ జరిగింది. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తు్న్నప్పుడు, పైకప్పు నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడి చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించి, కోర్టులో హాజరు పరిచారు.
15 ఏళ్ల పగ-కారణం ఇదే..
స్టేషన్ హౌజ్ అధికారి ప్రవీణ్ ఆర్య నిందితుడి గురించి సంచలన విషయాలు వెల్లడించాయి. 15 ఏళ్ల క్రితం అలీరాజ్పూర్లో ఒక పోలీస్ అతడిని తీవ్రంగా కొట్టాడని, అప్పటి నుంచి పోలీసులు అంటే పగ పెంచుకుని, వారి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. దీపేష్ ఇప్పటి వరకు 16 మంది పోలీసులు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఉండే ప్రాంతాల్లో వీధి వ్యాపారిగా నటిస్తూ రెక్కీ నిర్వహించి, రాత్రిళ్లు ఇళ్లలో చోరీలు చేసేవాడని చెప్పారు. అయితే, దొంగతనాల్లో సహకరించే రమేష్, భూరాలియా కోసం ఇంకా పోలీసులు వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!