King Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన.. దేనికోసమంటే..!?
- బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన
- 4 రోజుల పర్యటన ముగించుకుని యూకేకు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు. ఓ మెడిటేషన్ సెంటర్లో దంపతులిద్దరూ సేదతీరుతున్నారు. అత్యంత రహస్యంగా ఈ పర్యటన సాగుతోంది. తాజాగా ఈ సమాచారం మీడియాకు లీక్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత చార్లెస్ది భారత్లో ఇదే తొలి పర్యటన.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
బ్రిటన్ రాజు చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా అక్టోబర్ 27న బెంగళూరుకు వచ్చారు. నాలుగు రోజుల పర్యటన కోసం దంపతులిద్దరూ వచ్చారు. బెంగళూరులోని విశాలమైన ఇంటిగ్రేటివ్ మెడికల్ ఫెసిలిటీలో బస చేశారు. ఇద్దరూ ప్రసిద్ధ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ సౌక్యాలో బస చేశారు. ఈ ప్రదేశం యోగా, మెడిటేషన్ సెషన్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఇతర చికిత్సలతో సహా పునరుజ్జీవన చికిత్సకు ప్రసిద్ధి చెందిందని ఒక అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కూడా దంపతులిద్దరూ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో సహా అనేక ఆరోగ్య చికిత్సలు తీసుకున్నట్లు సమాచారం. ఉదయపు దినచర్యగా యోగా చేసేవారు. అనంతరం ప్రత్యేకమైన ఆహారం తీసుకున్నారు. ధ్యానంతో పాటు ప్రత్యేకమైన చికిత్సలు కూడా తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. దంపతులిద్దరూ 30 ఎకరాల క్యాంపస్ చుట్టూ ఎక్కవ సేపు నడవడం.. సేంద్రీయ వ్యవసాయానికి వెళ్లి ఆనందించేవారని చెప్పారు. గత మూడు రోజులుగా మెడికల్ క్యాంప్లో ఇలానే గడిపారని తెలిపారు. బుధవారం పర్యటన ముగించుకుని వెళ్లిపోయినట్లు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bitter Gourd: ఈ విషయం తెలిస్తే కాకరకాయను అసలు వదలరుగా..
కింగ్ చార్లెస్కు ఇలాంటి పర్యటనలు చేయడం మొదటిసారి కాదు. 2019లో కూడా తన 71వ పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నారు. యూకే రాజుగా చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు డాక్టర్ ఇస్సాక్ మథాయ్ ఆహ్వానింపబడ్డారు. భారతదేశం నుంచి ఆహ్వానించబడిన కొద్దిమంది వ్యక్తుల్లో ఇతడొకరు. చార్లెస్ చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Top10 Features on New Cars: కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? గమనించాల్సిన టాప్10 ఫీచర్లు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!