King Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన.. దేనికోసమంటే..!?
- బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన
- 4 రోజుల పర్యటన ముగించుకుని యూకేకు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు. ఓ మెడిటేషన్ సెంటర్లో దంపతులిద్దరూ సేదతీరుతున్నారు. అత్యంత రహస్యంగా ఈ పర్యటన సాగుతోంది. తాజాగా ఈ సమాచారం మీడియాకు లీక్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత చార్లెస్ది భారత్లో ఇదే తొలి పర్యటన.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
బ్రిటన్ రాజు చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా అక్టోబర్ 27న బెంగళూరుకు వచ్చారు. నాలుగు రోజుల పర్యటన కోసం దంపతులిద్దరూ వచ్చారు. బెంగళూరులోని విశాలమైన ఇంటిగ్రేటివ్ మెడికల్ ఫెసిలిటీలో బస చేశారు. ఇద్దరూ ప్రసిద్ధ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ సౌక్యాలో బస చేశారు. ఈ ప్రదేశం యోగా, మెడిటేషన్ సెషన్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఇతర చికిత్సలతో సహా పునరుజ్జీవన చికిత్సకు ప్రసిద్ధి చెందిందని ఒక అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కూడా దంపతులిద్దరూ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో సహా అనేక ఆరోగ్య చికిత్సలు తీసుకున్నట్లు సమాచారం. ఉదయపు దినచర్యగా యోగా చేసేవారు. అనంతరం ప్రత్యేకమైన ఆహారం తీసుకున్నారు. ధ్యానంతో పాటు ప్రత్యేకమైన చికిత్సలు కూడా తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. దంపతులిద్దరూ 30 ఎకరాల క్యాంపస్ చుట్టూ ఎక్కవ సేపు నడవడం.. సేంద్రీయ వ్యవసాయానికి వెళ్లి ఆనందించేవారని చెప్పారు. గత మూడు రోజులుగా మెడికల్ క్యాంప్లో ఇలానే గడిపారని తెలిపారు. బుధవారం పర్యటన ముగించుకుని వెళ్లిపోయినట్లు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bitter Gourd: ఈ విషయం తెలిస్తే కాకరకాయను అసలు వదలరుగా..
కింగ్ చార్లెస్కు ఇలాంటి పర్యటనలు చేయడం మొదటిసారి కాదు. 2019లో కూడా తన 71వ పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నారు. యూకే రాజుగా చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు డాక్టర్ ఇస్సాక్ మథాయ్ ఆహ్వానింపబడ్డారు. భారతదేశం నుంచి ఆహ్వానించబడిన కొద్దిమంది వ్యక్తుల్లో ఇతడొకరు. చార్లెస్ చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Top10 Features on New Cars: కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? గమనించాల్సిన టాప్10 ఫీచర్లు..
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!