King Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన.. దేనికోసమంటే..!?
- బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన
- 4 రోజుల పర్యటన ముగించుకుని యూకేకు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు. ఓ మెడిటేషన్ సెంటర్లో దంపతులిద్దరూ సేదతీరుతున్నారు. అత్యంత రహస్యంగా ఈ పర్యటన సాగుతోంది. తాజాగా ఈ సమాచారం మీడియాకు లీక్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత చార్లెస్ది భారత్లో ఇదే తొలి పర్యటన.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
బ్రిటన్ రాజు చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా అక్టోబర్ 27న బెంగళూరుకు వచ్చారు. నాలుగు రోజుల పర్యటన కోసం దంపతులిద్దరూ వచ్చారు. బెంగళూరులోని విశాలమైన ఇంటిగ్రేటివ్ మెడికల్ ఫెసిలిటీలో బస చేశారు. ఇద్దరూ ప్రసిద్ధ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ సౌక్యాలో బస చేశారు. ఈ ప్రదేశం యోగా, మెడిటేషన్ సెషన్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఇతర చికిత్సలతో సహా పునరుజ్జీవన చికిత్సకు ప్రసిద్ధి చెందిందని ఒక అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కూడా దంపతులిద్దరూ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో సహా అనేక ఆరోగ్య చికిత్సలు తీసుకున్నట్లు సమాచారం. ఉదయపు దినచర్యగా యోగా చేసేవారు. అనంతరం ప్రత్యేకమైన ఆహారం తీసుకున్నారు. ధ్యానంతో పాటు ప్రత్యేకమైన చికిత్సలు కూడా తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. దంపతులిద్దరూ 30 ఎకరాల క్యాంపస్ చుట్టూ ఎక్కవ సేపు నడవడం.. సేంద్రీయ వ్యవసాయానికి వెళ్లి ఆనందించేవారని చెప్పారు. గత మూడు రోజులుగా మెడికల్ క్యాంప్లో ఇలానే గడిపారని తెలిపారు. బుధవారం పర్యటన ముగించుకుని వెళ్లిపోయినట్లు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bitter Gourd: ఈ విషయం తెలిస్తే కాకరకాయను అసలు వదలరుగా..
కింగ్ చార్లెస్కు ఇలాంటి పర్యటనలు చేయడం మొదటిసారి కాదు. 2019లో కూడా తన 71వ పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నారు. యూకే రాజుగా చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు డాక్టర్ ఇస్సాక్ మథాయ్ ఆహ్వానింపబడ్డారు. భారతదేశం నుంచి ఆహ్వానించబడిన కొద్దిమంది వ్యక్తుల్లో ఇతడొకరు. చార్లెస్ చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Top10 Features on New Cars: కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? గమనించాల్సిన టాప్10 ఫీచర్లు..
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..