Bengaluru Traffic: బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలేసి నడిచి వెళ్లిన ప్రయాణికులు
- బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్..
- వాహనాలను వదిలేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బెంగళూరు ట్రాఫిక్ జామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Traffic: భారతదేశంలో ట్రాఫిక్ జామ్ అంటే తొలుత గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరే. కొద్దీ దూరానికే గంటలు గంటలు వేచి చూడటం బెంగళూరు వాసులకు అలవాటుగా మారిపోయింది. ట్రాఫిక్తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో బెంగళూరు ఉంది. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. ఇక వరుస సెలవులు, భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడ పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మహా నగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కిలో మీటరు దూరానికి గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.
Read Also: OnePlus 13 Lauch: ‘వన్ప్లస్ 13’ వచ్చేస్తోంది.. ట్రిపుల్ కెమెరా, జంబో బ్యాటరీ!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
అయితే, తాజాగా బెంగళూరు నగరంలో మరోసారి అలాంటి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం మహానగరంలో భారీ వర్షం పడింది. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్పై పెద్ద ఎత్తున జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్పైనే ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో విసుగు చెందిన కొందరు వాహనాలను వదిలి పెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇక, భారీ వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు నీటిలోనే నదులను తలపిస్తున్నాయి. దాంట్లో ప్రజలు రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ వర్షాలకు ఇప్పటి వరకూ 5 మంది చనిపోయినట్లు సమాచారం.
Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6
— Maria Stefina! 🤍 (@MariaStefina) October 23, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?