Bengaluru Traffic: బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలేసి నడిచి వెళ్లిన ప్రయాణికులు
- బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్..
- వాహనాలను వదిలేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బెంగళూరు ట్రాఫిక్ జామ్..
Bengaluru Traffic: భారతదేశంలో ట్రాఫిక్ జామ్ అంటే తొలుత గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరే. కొద్దీ దూరానికే గంటలు గంటలు వేచి చూడటం బెంగళూరు వాసులకు అలవాటుగా మారిపోయింది. ట్రాఫిక్తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో బెంగళూరు ఉంది. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. ఇక వరుస సెలవులు, భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడ పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మహా నగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కిలో మీటరు దూరానికి గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.
Read Also: OnePlus 13 Lauch: ‘వన్ప్లస్ 13’ వచ్చేస్తోంది.. ట్రిపుల్ కెమెరా, జంబో బ్యాటరీ!
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
అయితే, తాజాగా బెంగళూరు నగరంలో మరోసారి అలాంటి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం మహానగరంలో భారీ వర్షం పడింది. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్పై పెద్ద ఎత్తున జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్పైనే ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో విసుగు చెందిన కొందరు వాహనాలను వదిలి పెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇక, భారీ వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు నీటిలోనే నదులను తలపిస్తున్నాయి. దాంట్లో ప్రజలు రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ వర్షాలకు ఇప్పటి వరకూ 5 మంది చనిపోయినట్లు సమాచారం.
Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6
— Maria Stefina! 🤍 (@MariaStefina) October 23, 2024
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?