మానవత్వం మంటకలిసిపోతున్న నేటి రోజుల్లో తారక్ మజుందార్ లాంటి వాళ్లు ఉన్నారంటే ఆశ్యర్యపోకమానదు. ఇంతకు ఆయన ఏం చేశారంటారా... చనిపోయిన తన పెంపుడు చిలుకకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి దానిపట్ల.. తన ప్రేమను చాటుకున్నాడు.
పశ్చిమ బెంగాల్లో శుక్రవారం రెండు దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడితో పాటు అతడి కుటుంబసభ్యులు హత్యకు గురికాగా.. మరో ఘటనలో పార్టీ మద్దతుదారు హత్యకు గురయ్యారు. ఓ ఘటన ఉత్తర బెంగాల్లో జరగగా.. మరొకటి నదియా జిల్లాలో జరిగింది.
పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హల్దియా-మెచెడా రాష్ట్ర రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్పారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసే దాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహితల హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి.
బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్ వద్ద బాంబు పేలింది. ఈ పేలుడులో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించగా.. పంచాయతీ పెద్ద గాయపడడం రాజకీయ వర్గాల్లో వాగ్వాదానికి దారితీసింది.
కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ను తాకింది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని ఒక పాఠశాలలో హిజాబ్, నామబలి(కాషాయ వస్త్రాలు) ధరించ రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది.