Man Kills Wife: కాళ్లు చేతులు కట్టి గొంతుకోసి భార్య హత్య.. ఆపై రైలు కింద దూకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife: ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్పారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారిక వర్గాల ప్రకారం.. బహిరంగ మైదానంలో మహిళ మృతదేహం కనుగొనబడింది, ఆమె భర్త మృతదేహాన్ని ఆ మైదానం సమీపంలో రైలు పట్టాలపై స్వాధీనం చేసుకున్నారు. మృతులను జయంత్ సర్దార్, భార్య దీపాలి సర్దార్గా గుర్తించారు. దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కుటుంబ కలహాల కారణంగా దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీపాలి తన తండ్రితో కలిసి జీవించింది. దంపతుల మధ్య గొడవలు పెరగడంతో కోర్టును ఆశ్రయించి విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. దంపతులు అప్పుడప్పుడు కలుసుకునేవారు. శుక్రవారం రాత్రి జయంత్ దీపాలిని కలవాలని పిలిచాడు. శనివారం ఉదయం చేతులు, కాళ్లు కట్టివేయబడిన స్థితిలో దీపాలి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. ఘటనాస్థలికి చేరుకున్న కృష్ణగంజ్ పోలీసులకు సమాచారం అందించారు. దీపాలి మృతదేహం ఉన్న మైదానానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై జయంత్ మృతదేహం లభ్యమైంది.
Also Read
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
Read Also: Bungee Jumping : బంగీ జంప్ చేశాడు.. బురదలో పడ్డాడు.. లేకుంటే మనోడి పని?
కజ్లీ సర్దార్ అనే స్థానికుడు మాట్లాడుతూ.. దంపతులు ఎప్పుడూ గొడవ పడుతుండేవారని.. కోర్టులో కేసు నడుస్తుంటే అప్పుడప్పుడు కలిసేవారని.. దీపాలిని కలవాలని జయంత్ రాత్రి ఫోన్ చేశాడని చెప్పాడు. దీపాలి తల్లి మాట్లాడుతూ.. “రాత్రి 11 గంటల ప్రాంతంలో దీపాలిని కలవాలని జయంత్ ఫోన్ చేసాడు. ఆ సమయంలో ఆమె నిద్రలో ఉంది, కానీ జయంత్ ఆమెను కలవాలని పట్టుబట్టాడు. ఆమె అతనిని కలవడానికి వెళ్ళింది, కానీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు, మాకు అనుమానం పెరిగింది. శనివారం ఉదయం దీపాలి హత్యకు గురైందని, పదునైన ఆయుధంతో హత్య చేశారని మాకు తెలిసింది.’ అని ఆమె చెప్పారు. మరో స్థానికుడు తపన్ సర్దార్ మాట్లాడుతూ, “జయంత్ ఆమె చేతులు, కాళ్ళు కట్టి చంపి ఆపై రైలు ముందు దూకి ఉండాలి. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నేలపై రక్తపు మడుగులో పడి ఉన్న దీపాలి మృతదేహాన్ని చూశాము. భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరిగినా, జయంత్ ఆమెను చంపేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు.’ అని తెలిపాడు. ఈ విషయమై కృష్ణగంజ్ పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?