Messi row: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్కతాలో మెస్సీ పర్యటనలో వైఫల్యం అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంచలనంగా మారింది. విపక్షాల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
పశ్చిమ బెంగాల్కు చెందిన ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభించింది. ప్రత్యేక సర్వే ముగియడంతో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి.
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మోడీ ప్రచారం నిర్వహించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో గత 20 ఏళ్లుగా ప్రభుత్వం నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ఆచారానికి స్వస్తి పలికారు. రెండు దశాబ్దాల తర్వాత హిందూ, ముస్లిం విద్యార్థులు తొలిసారిగా కలిసి బుధవారం మధ్యాహ్న భోజనం చేశారు. వివిధ మతాల విద్యార్థులకు వేర్వేరు భోజనం వడ్డిస్తున్న ఏళ్ల తరబడి ఆచారంపై విమర్శలు రావడంతో ఈ విధానాన్ని రద్దు చేసింది.
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముర్షిదాబాద్లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి పశ్చిమబెంగాల్ అట్టుడుకుతోంది. గత కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితుల్ని గమనించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని తేల్చి చెప్పారు
Kolkata: గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని మాయం చేద్దామనుకున్న ఇద్దరు లేడీస్ అనూహ్య రీతిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సంఘటన కోల్కతాలో మంగళవారం జరిగింది. సూట్కేస్లో శవాన్ని తీసుకువచ్చిన ఇద్దరు మహిళలు, నగరంలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్లో పారేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, రోజూ వారీ యోగా సెషన్కి వచ్చే వారు వీరిని పట్టుకున్నారు. సూట్కేస్లో మృతదేహాన్ని చూసి ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు.
India-Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది. ముఖ్యంగా తన స్థాయి ఏమిటో మరిచిపోయి భారత్కి వార్నింగ్ ఇస్తోంది. అక్కడి జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి మతోన్మాద, తీవ్రవాద సంస్థలు భారత దేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి.