నంద్యాల జిల్లాలో జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య.. ఎంతో మంద్రి క్రిమినల్స్ బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతున్నారనే సంచలన విషయాన్ని బయటపెట్టింది.. 120 మంది బిచ్చగాళ్లలో 30 మందికి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు నివేదిక అందింది.. డేటా సేకరించి పోలీసులు.. వారిని మందలించి పంపినట్టుగా తెలుస్తోంది..
PAK Beggars: తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు.
బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే భిక్షాటనపై నిషేధం విధించింది. 10 నగరాల్లో ఈ ప్రచారం జరుగుతోంది. అధికార యంత్రాంగం కొన్ని షాకింగ్ విషయాలు కూడా వెల్లడించింది. బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించి ఆరు నెలల పాటు పని చేసేందుకు ఓ సంస్థ సహాయం చేస్తుందని తెలిపింది.
ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్థానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్కి సూచించింది.
పాకిస్థాన్ అధికారం ఇస్లామాబాద్, రావల్పిండి నుంచి నడుస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం కరాచీ నుంచే నడుస్తోంది. అందుకే ఈ నగరాన్ని పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. కానీ పాకిస్తాన్ ఆర్థిక రాజధానిని నెల రోజులుగా బిచ్చగాళ్ళు ఆక్రమించారు.
బిక్షగాళ్ల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించిందేకు కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. యాచకులు లేని దేశంగా ఇండియాను మార్చాలని కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, నగర కూడళ్లు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, చారిత్రిక ప్రదేశాల్లో బెగ్గర్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటారు. కొందరు ఎలాంటి ఆధారం లేని దివ్యాంగులు, అనాథ పిల్లలు, వృద్ధులు యాచిస్తుంటారు. ఇంకొందరు ఆయా కారణాల చేత ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. మరికొందరైతే ఈ…
Pakistan: విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయుల్లో 90 శాతం బిచ్చగాళ్లే అని ఇటీవల తేలింది. సౌదీ, ఇరాక్, యూఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్ దేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల రాయబారులు ఈ విషయంలో పాకిస్తాన్కి ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు పాకిస్తాన్ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి.
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏదైన తప్పుగా మాట్లాడితే వందల ఓట్లు పోతాయని అన్నారు. తామంతా ఓట్ల బిచ్చగాళ్లమని అంటూ కామెంట్స్ చేశారు. మేము ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలనే చూస్తామని.. నిజాలు మాట్లాడితే ఓట్లు పోవని సంజయ్ కుమార్ అన్నారు.
దేశం సాంకేతికంగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. డిటిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు క్యాష్ ను క్యారీ చేయడం లేదు. ఏది కావాలన్నా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీధిలో ఉండే బెగ్గర్లు అవస్థలు పడుతున్నారు. ఎవర్ని అడిగినా డబ్బులు లేవని చెబుతుండటంతో వారు కూడా టెక్నాలజీకి అప్గ్రేడ్ అవుతున్నారు. పేటీఎం, ఫోన్పే తదితర డిజిటల్ పేమెంట్ బోర్డులను మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైనా చిల్లర లేదని అంటే…
కరోనా సమయంలో యాచకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా తిండిలేక నరకయాతనలు అనుభవించారు. ప్రభుత్వాలు వీరికోసం ప్రత్యేకంగా షల్టర్లు ఏర్పాటు చేసి కొంతమేర ఆదుకుంది. అయితే, రాజస్థాన్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నప్పటికి విధి కారణంగా యాచక వృత్తిని స్వీకరిస్తుంటారు. ఇలాంటి వారికి గుర్తించి వారికి వొకేషనల్ లైఫ్ విట్ డిగ్నిటీ పేరుతో స్కిల్ డెవలప్మెంట్లో ఏడాదికాలంపాటు శిక్షణ ఇస్తోంది.…