Emergency: కంగనా రనౌత్ నటించిన ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘‘అత్యవసర పరిస్థితి’’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా, ఇందిరా గాంధీ పాత్రని పోషించింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాని బంగ్లాదేశ్ నిషేధించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా ఎమర్జెన్సీని బంగ్లా నిషేధించింది.
Emergency : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Puri Shankaracharya: ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని అడ్డుకోలేకపోతోంది.
రెండు దేశాల మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతపై భారత ప్రభుత్వం సోమవారం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్ను పిలిపించింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిచిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులోని ఐదు చోట్ల ఫెన్సింగ్లు ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపించడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది.
వాతావరణ శాఖ150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం 'అఖండ భారత్' కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. జనవరి 14న ఢిల్లీలోని భారత మండపంలో జరిగే ఈ సదస్సు కోసం అవిభక్త భారతదేశంలో భాగమైన పొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ పాల్గొంటుంది
Bangladesh: బంగ్లాదేశ్లో రోజురోజుకి భారత వ్యతిరేకత పెరుగుతోంది. హింసాత్మక ఉద్యమం తర్వాత ఆగస్టు 05న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్ అయ్యాడు.
Undivided India: భారత వాతావరణ శాఖ(IMD) నిర్వహించే ‘‘అన్ డివైడెడ్ ఇండియా’’ కార్యక్రమానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్లను భారత్ ఆహ్వానించింది. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబడుతున్న సెమినార్లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు ఇతర పొరుగు దేశాలను ఆహ్వానించింది.
Bangladesh: ఎప్పుడైతే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 05న భారత్ పారిపోయి వచ్చిందో అప్పటి నుంచి ఆ దేశం క్రమంగా పాకిస్తాన్ జిరాక్స్ కాపీలా మారుతోంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి మించి అక్కడ ఇస్లామిక్ రాడికల్ శక్తులు ఎదుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేమికులుగా పేరున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)తో పాటు రాడికల్ ఇస్లామిక్ శక్తులైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి శక్తులు ఆడిండే ఆటగా అక్కడ పాలన సాగుతోంది.
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత దేశం విడిచి భారత్లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు షేక్ హసీనా సహా 96 మంది పాస్పోర్టులను పాస్పోర్ట్, ఇమ్మిగ్రేషన్ విభాగం రద్దు చేసింది. గతేడాది జూలైలో జరిగిన హత్యలలో వారి ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకున్నారు. హసీనాపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) హసీనా, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు,…