Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..
- మహ్మద్ యూనస్తో జార్జ్ సోరోస్ కుమారుడి భేటీ..
- బంగ్లాదేశ్కి ట్రంప్ నిధులు ఆపేసిన తర్వాత కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.
వీరిద్దరు ఢాకాలో సమావేశమయ్యారు. సోరోస్, OSF అధ్యక్షుడు బినైఫర్ నౌరోజీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తాత్కాలిక ప్రభుత్వ సంస్కరణల ఎజెండాకు మద్దతు తెలిపినట్లు మహ్మద్ యూనస్ తెలిపారు. “ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి, మోసపోయిన ఆస్తులను కనుగొనడానికి, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి, కీలకమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలను చర్చించడానికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ నాయకత్వం బుధవారం ప్రధాన తాత్కాలిక సలహాదారుని కలిసింది” అని యూనస్ కార్యాలయం ట్వీట్ చేసింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
ఆర్థిక సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ, ఆస్తుల రికవరీ, కొత్త సైబర్ భద్రతా చట్టాలు, రోహింగ్యా సంక్షోభం వంటి అంశాలు చర్చలో కీలకంగా ఉన్నాయని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్ నెలలో అంటే, షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయన రెండు నెలల తర్వాత అలెక్స్ సోరోస్, యూనస్ న్యూయార్క్లో కలుసుకున్నారు. మహ్మద్ యూనస్ని తన తండ్రి( జార్జ్ సోరోస్) పాత స్నేహితుడు అంటూ అలెక్స్ సోరోస్ ప్రశంసించారు. బంగ్లాదేశ్లో మైక్రోఫైనాన్స్ మరియు సామాజిక కార్యకలాపాలలో తన కృషికి పేరుగాంచిన యూనస్కు జార్జ్ సోరోస్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.
అమెరికన్ బిలియనీర్ అయిన జార్జ్ సోరోస్, పలు దేశాల్లో అధికార మార్పిడికి కుట్రలు పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాను దించడంలో ఇతడి ప్రమేయం ఉందనే ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్లో అశాంతికి అమెరికా ప్రమేయం ఉందని గతంలో షేక్ హసీనా వ్యాఖ్యానించింది. ఇటీవల మన దేశంలో కూడా జార్జ్ సోరోస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మన దేశాన్ని అస్థిర పరిచేందుకు జార్జ్ సోరోస్, అతడి సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ బీజేపీ ఆందోళన వ్యక్తి చేసింది. కాంగ్రెస్ పార్టీకి అతడితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!