Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..
- మహ్మద్ యూనస్తో జార్జ్ సోరోస్ కుమారుడి భేటీ..
- బంగ్లాదేశ్కి ట్రంప్ నిధులు ఆపేసిన తర్వాత కీలక పరిణామం..
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.
వీరిద్దరు ఢాకాలో సమావేశమయ్యారు. సోరోస్, OSF అధ్యక్షుడు బినైఫర్ నౌరోజీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తాత్కాలిక ప్రభుత్వ సంస్కరణల ఎజెండాకు మద్దతు తెలిపినట్లు మహ్మద్ యూనస్ తెలిపారు. “ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి, మోసపోయిన ఆస్తులను కనుగొనడానికి, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి, కీలకమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలను చర్చించడానికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ నాయకత్వం బుధవారం ప్రధాన తాత్కాలిక సలహాదారుని కలిసింది” అని యూనస్ కార్యాలయం ట్వీట్ చేసింది.
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
Read Also: India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
ఆర్థిక సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ, ఆస్తుల రికవరీ, కొత్త సైబర్ భద్రతా చట్టాలు, రోహింగ్యా సంక్షోభం వంటి అంశాలు చర్చలో కీలకంగా ఉన్నాయని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్ నెలలో అంటే, షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయన రెండు నెలల తర్వాత అలెక్స్ సోరోస్, యూనస్ న్యూయార్క్లో కలుసుకున్నారు. మహ్మద్ యూనస్ని తన తండ్రి( జార్జ్ సోరోస్) పాత స్నేహితుడు అంటూ అలెక్స్ సోరోస్ ప్రశంసించారు. బంగ్లాదేశ్లో మైక్రోఫైనాన్స్ మరియు సామాజిక కార్యకలాపాలలో తన కృషికి పేరుగాంచిన యూనస్కు జార్జ్ సోరోస్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.
అమెరికన్ బిలియనీర్ అయిన జార్జ్ సోరోస్, పలు దేశాల్లో అధికార మార్పిడికి కుట్రలు పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాను దించడంలో ఇతడి ప్రమేయం ఉందనే ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్లో అశాంతికి అమెరికా ప్రమేయం ఉందని గతంలో షేక్ హసీనా వ్యాఖ్యానించింది. ఇటీవల మన దేశంలో కూడా జార్జ్ సోరోస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మన దేశాన్ని అస్థిర పరిచేందుకు జార్జ్ సోరోస్, అతడి సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ బీజేపీ ఆందోళన వ్యక్తి చేసింది. కాంగ్రెస్ పార్టీకి అతడితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.
తాజావార్తలు
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!