Bangladesh Violence: షేక్ హసీనా రాజీనామా తర్వాత 232 మంది మృతి..
- షేక్ హసీనా గద్దె దిగినా బంగ్లాదేశ్లో ఆగని హింస..
- రాజీనామా తర్వాత 232 మంది మృతి..
- హిందువులు.. అవామీ లీగ్ నేతలే టార్గెట్గా హత్యలు..
- రిజర్వేషన్ కోటా అల్లర్లలో మొత్తంగా 560 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది. నోబెల్ విజేత మహ్మద్ యూనస్ ప్రధాని కాబోతున్నారు. ఇదిలా ఉంటే, షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినా అక్కడ హింసాకాండ ఆగలేదు. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులతో పాటు అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. చాలా ప్రాంతాల్లో దేవాలయాలను తగలబెట్టడంతో పాటు హిందూ మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు.
Read Also: Pawan Kalyan: అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
హసీనా రాజీనామా చేసిన తర్వాత ఏకంగా 232 మంది హింసలో మరణించారని గురువారం మీడియా నివేదికలు చెప్పాయి. మొత్తంగా ఈ రిజర్వేషన్ల ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 560కి చేరుకుంది. హసీనా పదవిలో ఉన్న సమయంలో అంటే జూలై 16 నుంచి ఆగస్టు 04 మధ్య 329 మంది చనిపోయారు. ఒక్క మంగళవారం రోజే వందల్లో మరణాలు సంభవించాయి. గాజీపూర్లోని కాశీంపూర్ హైసెక్యూరిటీ జైలు నుంచి మంగళవారం 209 మంది ఖైదీలు పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా జైలు గార్డులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
పోలీసుల్ని ఆందోళనకారులు టార్గెట్ చేసి హత్యలు చేస్తుండటంతో పలువురు పోలీస్ స్టేషన్లలో విధుల్లో చేరేందుకు భయపడుతున్నారు. ఈ మేరకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీస్ ప్రధాన కార్యాలయం కోరింది. బుధవారం కొత్తగా నియమితులైన ఇన్స్పెక్టర్ జనరల్ మైనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా ఢాకాతో పాటు పలు నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ని విద్యార్థులే నియంత్రిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నేతలు పారిపోకుండా చూస్తున్నారు. రాజ్షాహి సిటీ కార్పొరేషన్ వార్డ్ కౌన్సిలర్ మరియు రాజ్షాహి మెట్రోపాలిటన్ అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ రజబ్ అలీతో పాటు అతని సహచరుడు జాకీర్ హొస్సేన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా సరిహద్దు గార్డ్ బంగ్లాదేశ్ (BGB) చుడంగాలోని దర్శన ICP చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!