Bangladesh Violence: షేక్ హసీనా రాజీనామా తర్వాత 232 మంది మృతి..
- షేక్ హసీనా గద్దె దిగినా బంగ్లాదేశ్లో ఆగని హింస..
- రాజీనామా తర్వాత 232 మంది మృతి..
- హిందువులు.. అవామీ లీగ్ నేతలే టార్గెట్గా హత్యలు..
- రిజర్వేషన్ కోటా అల్లర్లలో మొత్తంగా 560 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది. నోబెల్ విజేత మహ్మద్ యూనస్ ప్రధాని కాబోతున్నారు. ఇదిలా ఉంటే, షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినా అక్కడ హింసాకాండ ఆగలేదు. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులతో పాటు అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. చాలా ప్రాంతాల్లో దేవాలయాలను తగలబెట్టడంతో పాటు హిందూ మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు.
Read Also: Pawan Kalyan: అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు
Also Read
హసీనా రాజీనామా చేసిన తర్వాత ఏకంగా 232 మంది హింసలో మరణించారని గురువారం మీడియా నివేదికలు చెప్పాయి. మొత్తంగా ఈ రిజర్వేషన్ల ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 560కి చేరుకుంది. హసీనా పదవిలో ఉన్న సమయంలో అంటే జూలై 16 నుంచి ఆగస్టు 04 మధ్య 329 మంది చనిపోయారు. ఒక్క మంగళవారం రోజే వందల్లో మరణాలు సంభవించాయి. గాజీపూర్లోని కాశీంపూర్ హైసెక్యూరిటీ జైలు నుంచి మంగళవారం 209 మంది ఖైదీలు పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా జైలు గార్డులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
పోలీసుల్ని ఆందోళనకారులు టార్గెట్ చేసి హత్యలు చేస్తుండటంతో పలువురు పోలీస్ స్టేషన్లలో విధుల్లో చేరేందుకు భయపడుతున్నారు. ఈ మేరకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీస్ ప్రధాన కార్యాలయం కోరింది. బుధవారం కొత్తగా నియమితులైన ఇన్స్పెక్టర్ జనరల్ మైనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా ఢాకాతో పాటు పలు నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ని విద్యార్థులే నియంత్రిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నేతలు పారిపోకుండా చూస్తున్నారు. రాజ్షాహి సిటీ కార్పొరేషన్ వార్డ్ కౌన్సిలర్ మరియు రాజ్షాహి మెట్రోపాలిటన్ అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ రజబ్ అలీతో పాటు అతని సహచరుడు జాకీర్ హొస్సేన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా సరిహద్దు గార్డ్ బంగ్లాదేశ్ (BGB) చుడంగాలోని దర్శన ICP చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?