Bangladesh crisis: బంగ్లా జైళ్ల నుంచి 1200 మంది ఖైదీలు పరార్.. ఇండియాలోకి చొరబడే ఛాన్స్..
- బంగ్లా జైళ్ల నుంచి 1200 మంది ఖైదీలు పరార్..
- భారత్లోకి చొరబడే ఛాన్స్..
- అప్రమత్తమైన బీఎస్ఎఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh crisis: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగి అల్లర్లు, హింస గురించి అందరికి తెలిసిందే. చివరకు షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోవాల్సి వచ్చింది. అల్లర్ల సమయంలో పలు జైళ్లపై దాడులు చేసిన నిరసనకారులు, అందులో ఉన్న ఖైదీలు తప్పించుకునేందుకు కారణమయ్యారు. షేక్ హసీనా రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే ఉగ్రవాదులతో సహా 1200 మంది ఖైదీలు పలు జైళ్ల నుంచి తప్పించుకున్నారు. అయితే, వీరితో భారత భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) తెలిపింది.
తప్పించుకున్న ఖైదీలు సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని బంగ్లాదేశ్ భద్రతా సంస్థలు బీఎస్ఎఫ్కి సమాచారం అందించాయి. బంగ్లా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే బంగ్లా-భారత్ సరిహద్దు వద్ద ఆర్మీ, బీఎస్ఎఫ్ గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. బంగ్లా అల్లర్ నేపథ్యంలో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)కి చెందిన అధికారులు దేశంలోని శాంతిభద్రతలను చక్కబెట్టేందుకు వెళ్లారు. బంగ్లా వైపు సరిహద్దుల వద్ద భద్రత బలహీనంగా ఉంది.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: Vivo V40 Pro Price: 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 బ్యాటరీ.. వివో నుంచి సూపర్ స్మార్ట్ఫోన్స్!
సరిహద్దుల్లో భద్రత కోసం ఇరు దేశాల బలగాలు వేర్వేరు స్థాయిల్లో కమ్యూనికేషన్ ఛానెళ్లను తెరిచి, రోజూ చర్చలు జరుపుతున్నారు. చొరబాటుదారులు భారత్లోకి రాకుండా రియల్ టైమ్లో సమాచారాన్ని పంచుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల బలగాలకు చెందిన కమాండెంట్లు, నోడల్ అధికారులు, సరిహద్దు ఐజీలు ఇతర ర్యాంకుల అధికారులు అన్ని స్థాయిలో సమాచారం మార్పిడి చేసుకుంటున్నారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 4096 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది.
నార్సింగి, షేర్పూర్, సత్ఖిరా, కుస్తియా మరియు కాశీంపూర్ అనే ఐదు జైళ్ల నుండి ఖైదీలు తప్పించుకుంటున్నారని బంగ్లా అధికారులు మన అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, చొరబాటుదారులు ఏం చెప్పినా దేశంలోకి అనుమతించేది లేదని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. నార్సింగి జైలు నుంచి తప్పించుకున్న 400 మంది ఖైదీలు లొంగిపోయారని బీజీబీ అధికారులకు బీఎస్ఎఫ్కి సమాచారం అందించారు. అయితే, హెఫాజాత్-ఇ-ఇస్లామ్ కి చెందిన వారు ఇంకా మిస్సింగ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు, ముఖ్యంగా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!