Congress Leader: షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏదో రోజు పీఎం ఇంటిని ఆక్రమిస్తామన్న సజ్జన్ వర్మ.. సల్మాన్ ఖుర్షీద్ తర్వాత మరో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader: బంగ్లాదేశ్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు భారత్లో కూడా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశంలో హింసను రాజేయడం కాంగ్రెస్ ఉద్దేశమా..? అని కమలం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్లో ఏదో రోజు ప్రధాని నరేంద్రమోడీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోడీకి పడుతుందని అన్నారు. బంగ్లాదేశ్లో వేలాది మంది నిరసనకారులు సోమవారం ఢాకాలోని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
Read Also: MP Fraud: సరికొత్త మోసం.. వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో పెట్టి నగదు కాజేసిన కేటుగాళ్లు
ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఐఎంసి)లో జరిగిన కుంభకోణాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ, పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా పాలనకి వ్యతిరేకంగా పౌర అశాంతి సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించారని టీవీ ఛానెల్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ‘‘నరేంద్ర మోదీ జీ, మీ తప్పుడు విధానాల వల్ల ఏదో ఒక రోజు ప్రజలు ప్రధాని నివాసంలోకి ప్రవేశించి (పీఎం హౌస్ని) ఆక్రమించుకుంటారు, ఇది ఇటీవల శ్రీలంకలో (2022లో) జరిగింది, ఆ తర్వాత బంగ్లాదేశ్ జరిగింది. రేపు భారత్ వంతు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ యువమోర్చా కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. 140 కోట్ల భారతీయులు మనోభావాలను వర్మ దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించి, చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు.
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!