Congress Leader: షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏదో రోజు పీఎం ఇంటిని ఆక్రమిస్తామన్న సజ్జన్ వర్మ.. సల్మాన్ ఖుర్షీద్ తర్వాత మరో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader: బంగ్లాదేశ్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు భారత్లో కూడా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశంలో హింసను రాజేయడం కాంగ్రెస్ ఉద్దేశమా..? అని కమలం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్లో ఏదో రోజు ప్రధాని నరేంద్రమోడీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోడీకి పడుతుందని అన్నారు. బంగ్లాదేశ్లో వేలాది మంది నిరసనకారులు సోమవారం ఢాకాలోని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: MP Fraud: సరికొత్త మోసం.. వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో పెట్టి నగదు కాజేసిన కేటుగాళ్లు
ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఐఎంసి)లో జరిగిన కుంభకోణాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ, పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా పాలనకి వ్యతిరేకంగా పౌర అశాంతి సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించారని టీవీ ఛానెల్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ‘‘నరేంద్ర మోదీ జీ, మీ తప్పుడు విధానాల వల్ల ఏదో ఒక రోజు ప్రజలు ప్రధాని నివాసంలోకి ప్రవేశించి (పీఎం హౌస్ని) ఆక్రమించుకుంటారు, ఇది ఇటీవల శ్రీలంకలో (2022లో) జరిగింది, ఆ తర్వాత బంగ్లాదేశ్ జరిగింది. రేపు భారత్ వంతు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ యువమోర్చా కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. 140 కోట్ల భారతీయులు మనోభావాలను వర్మ దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించి, చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..