Bangladesh: బంగ్లాదేశ్లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దైవ దూషణ చేశాడనే ఆరోపణలతో వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు దాస్పై మూక దాడికి పాల్పడి, అతడిని దారుణం హత్య చేసి, చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండించింది. దీని తర్వాత కూడా పలువురు హిందువులు హత్యకు గురయ్యారు. దీపు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఉపాధ్యాయుడు యాసిన్ అరాఫత్ను పోలీసులు…
Bangladesh: బంగ్లాదేశ్లో అరాచకం ఏ విధంగా రాజ్యమేలుతుందనే దానికి ఈ సంఘటన ఉదాహరణ. విద్యార్థి ఉద్యమం ముసుగులో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కొనసాగిన ఈ హింసాత్మక సంఘటనల్లో అనేక మంది హిందువుల్ని హత్య చేయడంతో పాటు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
Bangladesh: రాజకీయ అస్థిరత, తీవ్ర మనోన్మాదంలో ఉన్న బంగ్లాదేశ్పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కారణం అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడమే. అయితే, దీంట్లో విమర్శించాల్సిన విషయం ఏమిటని చాలా మందికి అనుమానం వస్తుంది. ఈ మొక్కజొన్నను పండించడంలో ‘‘పంది మలం’’ వాడటంతో ఇది వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్ నిర్ణయంపై చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో పంది మలాన్ని సాధారణ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే, ముస్లిం మెజారిటీ కలిగిన బంగ్లాదేశ్లో ఇది…
భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్లోని ఓ కోర్టు పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును ది డైలీ స్టార్ నివేదించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జ్ కోర్టు-4 న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. అవినీతి నిరోధక కమిషన్ (ACC) దాఖలు…
Muhammad Yunus: బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ భారత్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదన్నారు. కానీ, భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
Arakan Army: పాకిస్థాన్ నుంచి విడిపోయిన తర్వాత 1971లో బంగ్లాదేశ్ భారత్ సహాయంతో ప్రత్యేక దేశంగా అవతరించింది. తాజాగా మరోమారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్కు సంబంధించి అరకాన్ ఆర్మీ దేశ విభజనకు ప్రమాదకరమైన ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. రఖైన్లో ప్రత్యేక దేశాన్ని సృష్టించి బంగ్లాదేశ్ను విచ్ఛిన్నం చేయడానికి అరకాన్ ఆర్మీ యోధులు రహస్య మిషన్లో పనిచేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్-మయన్మార్…
బంగ్లాదేశ్లో తాలిబన్ల మాదిరిగా మోరల్ పోలీసింగ్ చేయడానికి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ కార్యాలయంలో మహిళా అధికారులు పొట్టి దుస్తులు, పొట్టి చేతుల చొక్కాలు, లెగ్గింగ్లు ధరించడానికి అనుమతి లేదని ఒక ఉత్తర్వు జారీ చేసింది. మూడు రోజుల క్రితం, బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు తన మహిళా ఉద్యోగులను వృత్తిపరమైన దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని కోరింది. బంగ్లాదేశ్ బ్యాంకు మానవ వనరుల విభాగం కూడా ఈ ఆదేశాన్ని…
ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొంది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తానని తెలిపిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది. బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం, విదేశీయులను వివాహం చేసుకోవడానికి సంబంధిత చట్టాలను ఖచ్చితంగా పాటించాలని చైనా పౌరులకు సూచించింది. Also Read:PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్-2 టార్గెట్!…
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్కి అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంగా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఇదిలా ఉంటే, మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో, ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’కి సమీపంలో బంగ్లాదేశ్ లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరిస్తోంది. ఇది భారత్కి 100 కి.మీ దూరంలో ఉంది. దీని పునర్నిర్మాణంలో చైనా సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే మేటి ఒకడిగా పేరు తెచ్చుకున్న వెటరన్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా సోషల్ మీడియా వేదికగా తాను రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. దాంతో బంగ్లాదేశ్ క్రికెట్ స్వర్ణ తరం ఐదుగురు పాండవులు ఆటకు దూరమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన తర్వాత ముష్ఫికర్ రహీమ్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. మష్రఫే మోర్తాజా, తమీమ్ ఇక్బాల్ ఇప్పటికే…