Bangladesh: షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి. ముఖ్యంగా, పాకిస్తాన్తో కలిసి బంగ్లా ఆర్మీ చీఫ్ని మార్చడం లేదా ఆర్మీలో తిరుగుబాటు తేవడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. క్వార్టర్ మాస్టర్ జనరల్(QMG) అయిన లెఫ్టినెంట్ జనరల్ ఫైజుర్ రెహమాన్ కొన్ని రోజులుగా ఇందుకు కుట్ర పన్నుతున్నారనే వార్తలు వచ్చిన తర్వాత అతడిపై బంగ్లాదేశ్ ఆర్మీ నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా ఇందుకు…
Bangladesh : బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత, షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందారు. మహ్మద్ యూనస్ ప్రస్తుతం దేశ ప్రధానమంత్రి, కానీ అతడు త్వరలోనే ఆ పదవికి దూరం కాబోతున్నాడా ఏంటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Bangladesh : ఇస్లాంలో రంజాన్ మాసం చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఈ నెలలో దెయ్యం కూడా జైలు పాలవుతుందని అంటున్నారు. మరోవైపు, బంగ్లాదేశ్లో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే రంజాన్ ముందు దెయ్యాల వేట ఆపరేషన్ ప్రారంభించబడింది.
Bangladesh : క్రీడలతో సహా ప్రతి రంగంలో మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఆటలోనూ వారిని ముందుకు తెస్తున్నారు.
Bangladesh : బంగ్లాదేశ్ ఇప్పుడు తను పెట్టుకున్న నిప్పుకు తానే ఆహుతి అవుతుంది. దేశ రాజధాని ఢాకాలో రాత్రిపూట విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని నియంత్రించడంలో పరిపాలన నిస్సహాయంగా ఉండిపోయింది,
Bangladesh : జూలై-ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో 800 మందికి పైగా ఖైదీలు వివిధ జైళ్ల నుండి తప్పించుకున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమై దాదాపు ఏడు నెలలు గడిచినా వారిలో 700 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు.
India On Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ మత నాయకుడు, ఇస్కాన్ నేత, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేయడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై భారత్ ఆందోళన మంగళవారం వ్యక్తం చేసింది. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, హిందూ ఆలయాలు, హిందువుల ఆస్తులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Bangladesh : బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం దేశంలో నిరంతరం అనేక మార్పులు చేస్తోంది. అవామీ లీగ్ విద్యార్థి విభాగం గురించి ఎలాంటి వార్తలను ప్రచురించవద్దని బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ప్రత్యేక సహాయకుడు మహ్ఫూజ్ ఆలం గురువారం జర్నలిస్టులను కోరారు. ఇది ఇప్పుడు నిషేధిత సంస్థ అని, ఉగ్రవాద సంస్థ ప్రచారంలో మీరు ఎటువంటి పాత్ర పోషించవద్దని అన్నారు. జర్నలిస్టులను హెచ్చరిస్తూనే, మధ్యంతర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై ఎలాంటి దాడిని సహించదని, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని…
Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ తీవ్ర హింస, ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా నిన్న బంగ్లా ఆర్మీ విమానంలో ఇండియాకు చేరింది. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్బేస్లో ఆమె ప్రస్తుతం భారత అధికారుల రక్షణలో ఉంది. మరోవైపు ఇండియా నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆశ్రయం ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.