శాంతి భద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ గుండాల దాడిలో బీజేపీ నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు. దాడి అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరించడమేంటని ఆయన మండి పడ్డారు. సీఎం డైరెక్షన్లోనే దాడులకు కుట్ర జరిగిందన్నారు. ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిసేందుకు వస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎందుకింత అసహనం వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మీ అసలు బండారం…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్ను అడుగడునా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.. దీంతో.. పలు చోట్ల టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.. ఇక, వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పోలీసులు పనిచెప్పాల్సి వచ్చింది. Read Also: విశాఖ టు మధ్యప్రదేశ్.. అమెజాన్ ద్వారా గంజాయి..! తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల చిల్లేపల్లిలో బండి సంజయ్…
మీ రాజకీయ పబ్బం గడువు కోవడం కోసం గిరిజనుల భుజాలపై తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం బీజేపీ నేతలు మానుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఇకనైనా రాష్ర్ట బీజేపీ నేతలు దివాల కోరు మాటలను మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధంగా గిరిజనులకు రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల నిధులు వెచ్చిస్తే.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బండి సంజయ్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీకి కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తామని ఎగొట్టిందని ఆయన అన్నారు.ఆ వెయ్యి కోట్లు కూడా తెలంగాణ అప్పు తీసుకుని గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. బండి సంజయ్ చెప్పినట్టు కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇవ్వ…
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ- కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీల నేతలు ఇష్టం వచ్చి నట్లు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ నాయకులపై అనవసర ఆరో పణలు చేస్తే ఊరుకోబోమని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరిం చారు. ఇకనైనా బీజేపీ నేతలు పిచ్చి కూతలు మానుకోవాలన్నారు. మా 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తుమ్మితే ఆ తుంపర్లలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోతాయని,…
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. దీంతో భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఇదే అంశంపై చర్చించేందుకు డీకే అరుణ నివాసంలో బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఇటీవల విజయం సాధించిన ఈటల…
తెలంగాణ ధాన్యం కొనుగోలు రచ్చ జరుగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్స్ నేతలే రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలేమో రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతోందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనాల్సిన వాళ్ళే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని, మీకు చేత కాక చేతులు ఎతేశరా..? మాకు రాష్ట్ర పాలన చేత…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు…
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కొనుగోళ్లు ఆపమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై రాష్ర్టంలో అలజడి సృష్టిస్తుందన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్పై అనవసర విమర్శలు చేస్తుందని, విమర్శలు ఆపి కేంద్రాన్ని ధాన్యం కొనేలా ఒప్పించాలని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచుతామని ఆయన తెలిపారు. రాష్ర్టంలో వరి ధాన్యం…