Chiranjeevi – Venkatesh – Balakrishna in iifa 2024: శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా వేడుకకి భారత దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన హీరో హీరోయిన్లు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన అవార్డుల లిస్ట్ మేరకు అవార్డులను అందజేశారు నిర్వాహకులు. ఇకపోతే., టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, నానిలు పాల్గొన్నారు.…
పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా.అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఏఎన్నార్ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం అని అన్నారు. Also Read: Devara: ‘దేవర’ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?.. ఎన్టీఆర్…
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'భగవంత్ కేసరి' నిలిచింది. గతేడాది బాలయ్య నటించిన బ్లాక్బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్గా నిలిచింది.
అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.
Gopichand as Villian for Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు విలన్గా.. మ్యాచో స్టార్ గోపిచంద్ను సెట్ చేస్తున్నారా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్కు.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో.. ‘జయం’ సినిమాలో విలన్గా దుమ్ముదులిపేశాడు గోపీ. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్ది హీరో కటౌట్ కాబట్టి.. ‘యజ్ఙం’ సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి…
Balakrishna Donates 1 Crore to AP-TG CM Relief Funds amid Floods: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రదేశాలు వరదలతో విలవిలలాడుతున్నాయి. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న క్రమంలో సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు తమకు తోచినంత విరాళం ఇస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు, ఎన్టీఆర్, విశ్వక్ సేన్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ సహా పలువురు సినీ ప్రముఖులు…
Samarasimha Reddy Indra Crossover Movie on Cards: నందమూరి బాలకృష్ణ నటుడిగా మారి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఒక అరుదైన ఘట్టం కావడంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా కలిసి ఒక భారీ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధుల్లో ఒకరిగా హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేడుక సందర్భంగా బాలకృష్ణను పొగుడుతూ తాను చేసిన ఇంద్ర సినిమాకి కూడా సమరసింహారెడ్డి ఒకరకంగా ఇన్స్పిరేషన్ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.…
Bala Krishna’s 50 years golden jubliee celebrations : నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అంటూ హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. మెగాస్టార్ చిరంజీవి సహా శివ రాజ్ కుమార్, వెంకటేష్ సహా ఎంతో మంది కుర్ర హీరోలు హాజరైన ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది. వేదిక మొత్తం అతిథులతో నిండిపోతే ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ తో…
Chandrababu Tweet: ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న వరద సంభవించడంతో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పర్యటించి.. సహాయక చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్గా సుచిర్ ఇండియా కిరణ్తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా…