గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
PM Narendra Modi to visit Ayodhya on Diwali eve: ప్రధాని నరేంద్ర మోదీ వరసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించిన ఆయన ఆదివారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న రామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఆ తరువాత అయోధ్యలో జరిగే దీపోత్సవ కార్యక్రమానికి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మోదీ వెంట ఉండనున్నారు. రామాలయ నిర్మాణం గురించి ప్రధాని మోదీకి, యోగి…
Prime Minister Modi will visit Kedarnath: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేదార్ నాథ్ పర్యటనకు ఉత్తరాఖండ్ వేళ్లనున్నారు. రూ.3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి మోదీ కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించనున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కేదార్ నాథ్ ఆలయంలో ప్రార్థనలు, పూజలు చేయనున్నారు. కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Prime Minister Narendra Modi will visit temples: ప్రతీ దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సాయుధబలగాలతో గడుపుతుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా దేవాలయాల బాట పడుతున్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 24న దీపావళికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మోదీ. అక్టోబర్ 21 కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 23న ఛోటీ దీపావళి రోజు ఆయోధ్యలో పర్యటించనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు.
ప్రతీ భారతీయ పౌరుడికి ఈ దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ హద్దు మీరితే మాత్రం, పరిణామాలు తప్పవు. కొన్ని చోట్ల సంప్రదాయబద్దంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కాదు, కూడదు, ఫ్యాషన్, ట్రెండు అంటూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. కచ్ఛితంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. తామున్న చోటులో హద్దు మీరి ప్రవర్తించడంతో.. జనం బడితపూజ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అయోధ్యలోని సరయు నదిలో ఓ…
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఓ పథకం ఇప్పుడు వివాదాస్పందంగా మారింది. 60 ఏళ్లకు పైబడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్లను ఫ్రీగా అందిస్తుంది. దీనికోసం ఢిల్లీ సర్కార్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే, కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. కాగా, డిసెంబర్ 3…
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రచారం చేస్తున్నారు. ఒకే వర్గం ఓటర్లను ఆర్షించడం కాదు.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పిస్తున్నారు.. Read Also: ధాన్యం సేకరణపై పటిష్ట విధానం.. సీఎం ఆదేశాలు గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే…
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఫేక్ మార్కుల షీట్తో కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి జైలు శిక్ష వేసింది స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు. అంతే కాదు రూ. 8 వేల జరిమానా కూడా విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, ఇంద్ర ప్రతాప్ తివారీ.. డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. రెండో ఏడాది ఫెయిల్ అయినప్పటికీ తప్పుడు…