Lata Mangeshkar: అయోధ్యలో భారీ వీణ.. లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ ప్రారంభించనున్న ప్రధాని
Lata Mangeshkar: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లతా మంగేష్కర్ చౌక్ను వాస్తవంగా ప్రారంభించనున్నారు. లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరి 6న ముంబై ఆసుపత్రిలో మరణించారు.
అయోధ్యలోని సరయూ నది తీరంలో లతామంగేష్కర్ చౌక్లో అత్యంత భారీ వీణను ఏర్పాటు చేశారు. భారత శాస్త్రీయ సంగీత పరికరమైన ఈ వీణ సైజు 40అడుగుల పొడవు, 14టన్నుల బరువు ఉంది. నోయిడాలో రూపు దిద్దుకున్న భారీ వీణను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ శిల్పి రామ్ వన్జీ సుతార్ తయారు చేశారు.
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
Supreme Court: సుప్రీంలో చరిత్రాత్మక ఘట్టం.. విచారణలు ప్రత్యక్షప్రసారం
లత పుట్టడమే సంగీత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి పండిట్ దినానాథ్ మంగేష్కర్ ఆ రోజుల్లో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. ఆయన కచేరీలు అంటే దేశనాయకులు సైతం చెవికోసుకొనేవారు. తండ్రి వద్దనే సాధన ఆరంభించిన లత తరువాత సంగీతంలో అత్యున్నతంగా శిక్షణ తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆమె పసితనంలోనే తండ్రి కన్నుమూశారు. ఐదుమంది సంతానంలో లత అందరికన్నా పెద్ద. ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఆమె తరువాతి వారు. కుటుంబ పోషణ కోసం చిన్నతనంలోనే లత కొన్ని చిత్రాలలో బాలనటిగా నటించారు. తరువాత పాటతో పయనించారు. ఆమె గాత్రంలోని మాధుర్యం గమనించిన నౌషద్, సి.రామచంద్ర, ఎస్డీ బర్మన్, శంకర్-జైకిషన్, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి ఎంతగానో ప్రోత్సహించారు. తరువాతి తరం సంగీత దర్శకులు మదన్ మోహన్ వంటివారు లత పాటతోనే తమ ఉనికిని చాటుకున్నారు. అనేక చిత్ర విజయాలకు లత గానం తోడయింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నా లత పాటకోసం సదరు చిత్రాలను తిలకించిన వారు ఉన్నారు. ఇంతటి గానవైభవం ప్రదర్శించిన లతకు 1972లో పరిచయ్ చిత్రంలో పాటలకు తొలి నేషనల్ అవార్డు లభించింది.
తరువాత 1974లో ఖోరా కాగజ్, 1990లో లేకిన్ చిత్రాల ద్వారా మరో రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో నిలిచారు. ఆమె కీర్తి కిరీటంలో అనేక అవార్డులూ, రివార్డులూ రత్నాల్లా వెలుగొందుతూ ఉన్నాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, భారతరత్న అవార్డులు అందుకుని గానకోకిలగా తనదైన వైభవం ప్రదర్శించారు. 92 ఏళ్ల లతా కరోనా వల్ల అనారోగ్యంతో 29 రోజుల పాటు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందతూ ఫిబ్రవరి 6న కన్నుమూశారు.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!