అయోధ్యలో శ్రీరాముడి అలయం వేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. 2022 చివరి వరకు మొదటిదశ నిర్మాణం పనులు పూర్తి చేసుందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొని నిర్మాణం చేపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భవ్యరామాలయంలోని రాముడి అభిషేకానికి ప్రపంచంలోని 115 దేశాల నుంచి నీటిని తెప్పిచంచారు ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజయ్జొల్లి. ఢిల్లీ స్టడీ సర్కిల్ ఎన్జీవో సంస్థతో కలిసి ప్రపంచంలోని…
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సంస్థలు ఎన్నికలకు సంబందించి ముందస్తు సర్వేలు ఫలితాలు విడుదల చేశాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని, మళ్లీ సీఎంగా యోగీని ఎంచుకునే అవకాశం ఉందని ముందస్తు సర్వేలు పేర్కొన్నాయి. ఇక ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో యూపీనుంచి ఎంఐఎం కూడా బరిలోకి దిగుతున్నది. చారిత్రక నగరమైన అయోధ్య నుంచి ఎంఐఎం ఎన్నికల…
యూపీలోని అయోధ్యలో రామాలయం నిర్మాణం వేగంగా జరుగుతున్నది. 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయోధ్యలో ఉన్న మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర ఎయిర్పోర్టుకు సమీపంలో కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను నిర్మించబోతున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈ ప్రాజెక్టు బాధ్యతలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్కు అప్పగించారు. ఈ సంస్థ అధికారులు ఇటీవలే ఆయోధ్యవెళ్లి అక్కడ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వంతో చర్చలు…
దశాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉన్న ఆయోద్య రామాలయ నిర్మాణం పనులు ఎట్టకేలకు వేగంగా సాగుతున్నాయి. 2019లో ఆయోద్య రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో రామాలయ నిర్మాణం పనులు చేపట్టడానికి మార్గం సుగుమం అయింది. ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్నది. అయితే, రామాలయ నిర్మాణాన్ని 2023 చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. 2023 చివరి వరకు గర్భగుడి నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించింది. దానికి తగ్గట్టుగానే నిర్మాణం…
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మునిగిపోయారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. గుప్తార్ ఘాట్లో వద్ద స్నానాలు వెళ్లిన సమయంలో… వారంతా నీట మునిగిపోయారు. ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. రక్షించిన వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులంతా ఆగ్రాలోని…
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతిష్టాత్మకంగా సాగుతోంది… మరోవైపు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. అయోధ్యలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉదయం 11 గంటలకు పర్చువల్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రధాని.. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు.. అయోధ్యలో రామ్ మందిరం కోసం భూమి కొనుగోలుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. రామ్ మందిర్…