MLA Rajasingh: ఆరోజు మళ్లీ పోస్ట్ చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు రాజసింగ్ తరపు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని మంగళహాట్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో 295-A ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదుపై ఓవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారన్న రాజాసింగ్ పేర్కొన్నారు. చనిపోయే వరకు రామనామ జపం చేస్తూనే ఉంటానని తెలిపారు. హిందుత్వ సిద్ధాంతం కోసం రాముడి కోసం బుల్లెట్ తూటాలకైనా భయపడనన్న రాజా సింగ్ అన్నారు.
Read also: Punjab Blast Mastermind: 2019 పంజాబ్ పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
రాజాసింగ్ ఈ ఏడాది నవంబర్ 9న చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. రాజాసింగ్పై పీడీ యాక్టు నమోదు చేసిన పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి కారణమైంది. ఈ వీడియోలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఆగస్టు 22న అతడిని అరెస్టు చేశారు. అయితే కోర్టు రాజాసింగ్కు రిమాండ్ విధించలేదు. దీంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అయితే పాత కేసులను దృష్టిలో ఉంచుకుని రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి ఆగస్టు 25న అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఈ నెల 9న విడుదలైంది.
World Bank Revised India GDP Growth: మన దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.9 శాతానికి పెంపు
తాజావార్తలు
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
-
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
-
Vaibhav-BCCI: వైభవ్కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?