MLA Rajasingh: ఆరోజు మళ్లీ పోస్ట్ చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు రాజసింగ్ తరపు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని మంగళహాట్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో 295-A ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదుపై ఓవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారన్న రాజాసింగ్ పేర్కొన్నారు. చనిపోయే వరకు రామనామ జపం చేస్తూనే ఉంటానని తెలిపారు. హిందుత్వ సిద్ధాంతం కోసం రాముడి కోసం బుల్లెట్ తూటాలకైనా భయపడనన్న రాజా సింగ్ అన్నారు.
Read also: Punjab Blast Mastermind: 2019 పంజాబ్ పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
రాజాసింగ్ ఈ ఏడాది నవంబర్ 9న చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. రాజాసింగ్పై పీడీ యాక్టు నమోదు చేసిన పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి కారణమైంది. ఈ వీడియోలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఆగస్టు 22న అతడిని అరెస్టు చేశారు. అయితే కోర్టు రాజాసింగ్కు రిమాండ్ విధించలేదు. దీంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అయితే పాత కేసులను దృష్టిలో ఉంచుకుని రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి ఆగస్టు 25న అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఈ నెల 9న విడుదలైంది.
World Bank Revised India GDP Growth: మన దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.9 శాతానికి పెంపు
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!