MLA Rajasingh: ఆరోజు మళ్లీ పోస్ట్ చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు రాజసింగ్ తరపు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని మంగళహాట్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో 295-A ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదుపై ఓవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారన్న రాజాసింగ్ పేర్కొన్నారు. చనిపోయే వరకు రామనామ జపం చేస్తూనే ఉంటానని తెలిపారు. హిందుత్వ సిద్ధాంతం కోసం రాముడి కోసం బుల్లెట్ తూటాలకైనా భయపడనన్న రాజా సింగ్ అన్నారు.
Read also: Punjab Blast Mastermind: 2019 పంజాబ్ పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
Also Read
- IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం.. హైదరాబాద్కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
- Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
రాజాసింగ్ ఈ ఏడాది నవంబర్ 9న చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. రాజాసింగ్పై పీడీ యాక్టు నమోదు చేసిన పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి కారణమైంది. ఈ వీడియోలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఆగస్టు 22న అతడిని అరెస్టు చేశారు. అయితే కోర్టు రాజాసింగ్కు రిమాండ్ విధించలేదు. దీంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అయితే పాత కేసులను దృష్టిలో ఉంచుకుని రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి ఆగస్టు 25న అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఈ నెల 9న విడుదలైంది.
World Bank Revised India GDP Growth: మన దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.9 శాతానికి పెంపు
తాజావార్తలు
-
Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
-
India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
-
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
-
Suriya47: దీపావళి బరిలో ‘సూర్య47’?.. హ్యాట్రిక్ రిలీజ్కు స్టార్ హీరో రెడీ!
-
Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా…? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్ను రెచ్చగొట్టాడా..?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!