PM Narendra Modi: దేవాలయాల సందర్శనకు వెళ్లనున్న ప్రధాని మోదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prime Minister Narendra Modi will visit temples: ప్రతీ దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సాయుధబలగాలతో గడుపుతుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా దేవాలయాల బాట పడుతున్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 24న దీపావళికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 21 కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 23న ఛోటీ దీపావళి రోజు ఆయోధ్యలో పర్యటించనున్నారు.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేవాలయాలను సందర్శిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగా.. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అక్టోబర్ 21న తెల్లవారుజామున ప్రధాని ఢిల్లీ నుంచి కేదార్ నాథ్ బయలుదేరనున్నారు. అక్కడ దర్శనం అనంతంర రోప్ వేకు శంకుస్థాపన చేయనున్నారు. బద్రీనాథ్ వెళ్లే ముందు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. దేవాలయాల్లో దర్శనం అనంతరం ఆలయాల అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: 5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్
అక్టోబర్ 23న అయోధ్యలోని రామమందిర నిర్మాణాలను పరిశీలించనున్నారు. అక్కడే ప్రార్థనలు చేయనున్నారు. సరయూ నది ఒడ్డున సాయంత్ర జరిగే ఆరతి, దీపోత్సవాలకు ప్రధాని హాజరుకానున్నారు. రామ్ కీ పైరీపై దీపాలను వెలిగించనున్నారు.
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇటీవల విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 12 ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. 1985 నుంచి ఏ పార్టీ కూడా హిమాచల్ ప్రదేశ్ లో వరసగా రెండుసార్లు విజయం సాధించలేదు. అయితే ఈ సారి మాత్రం బీజేపీ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే గుజరాత్ ఎన్నికలు కూడా రానున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ప్రజల మూడ్ తెలియజేస్తాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!