PM Narendra Modi: దేవాలయాల సందర్శనకు వెళ్లనున్న ప్రధాని మోదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prime Minister Narendra Modi will visit temples: ప్రతీ దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సాయుధబలగాలతో గడుపుతుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా దేవాలయాల బాట పడుతున్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 24న దీపావళికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 21 కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 23న ఛోటీ దీపావళి రోజు ఆయోధ్యలో పర్యటించనున్నారు.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేవాలయాలను సందర్శిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగా.. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అక్టోబర్ 21న తెల్లవారుజామున ప్రధాని ఢిల్లీ నుంచి కేదార్ నాథ్ బయలుదేరనున్నారు. అక్కడ దర్శనం అనంతంర రోప్ వేకు శంకుస్థాపన చేయనున్నారు. బద్రీనాథ్ వెళ్లే ముందు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. దేవాలయాల్లో దర్శనం అనంతరం ఆలయాల అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
Read Also: 5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్
అక్టోబర్ 23న అయోధ్యలోని రామమందిర నిర్మాణాలను పరిశీలించనున్నారు. అక్కడే ప్రార్థనలు చేయనున్నారు. సరయూ నది ఒడ్డున సాయంత్ర జరిగే ఆరతి, దీపోత్సవాలకు ప్రధాని హాజరుకానున్నారు. రామ్ కీ పైరీపై దీపాలను వెలిగించనున్నారు.
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇటీవల విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 12 ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. 1985 నుంచి ఏ పార్టీ కూడా హిమాచల్ ప్రదేశ్ లో వరసగా రెండుసార్లు విజయం సాధించలేదు. అయితే ఈ సారి మాత్రం బీజేపీ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే గుజరాత్ ఎన్నికలు కూడా రానున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ప్రజల మూడ్ తెలియజేస్తాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!