Axar Patel: టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. అతను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. అతని భార్య మేహా పటేల్ గర్భవతి. గతేడాది జనవరిలో గుజరాత్లోని వడోదరలో మేహా పటేల్ను వివాహం చేసుకున్నాడు. అతని భార్య మేహా డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. ఇంతకుముందు, అక్షర్ ఇటీవల కపిల్ శర్మ కామెడీ షోలో ఈ…
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఇటీవల భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం జరిగిన ఈ షోకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్లు హాజరయ్యారు. షోలో అందరూ తమ సహచరులు, టీమ్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్కు…
IND vs SL 3rd T20 Playing 11: శ్రీలంక పర్యటనలో భారత జట్టు టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే.. మూడు టీ20ల సిరీస్ను 2-0తో సాధించింది. చివరిదైన మూడో టీ20 మ్యాచ్ పల్లెకెల వేదికగా మంగళవారం (జులై 30) రాత్రి జరగనుంది. నామమాత్రమైన ఈ మ్యాచ్లో బెంచ్ బలాన్ని టీమిండియా పరీక్షించనుంది. ఈ విషయాన్ని రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ క్రమంలో భారత తుది జట్టులో…
ICC T20 World Cup 2024 Team: తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించింది. ఇందులో టీమిండియా నుంచి ఏకంగా 6 మంది జట్టులో స్థానాన్ని సంపాదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోపాటు సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ లకు స్థానం దక్కింది. అయితే సీరిస్ మొత్తం విఫలమై కేవలం ఫైనల్ మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్ ను…
Delhi Capitals Captain is Axar Patel; ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆల్రౌండర్ అక్షర్ పటేల్ నడిపించనున్నాడు. ఐపీఎల్ 2024 భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్గా అక్షర్ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూరుతో మ్యాచ్కు ఢిల్లీ కెప్టెన్గా…
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మంచి ప్రదర్శనను చూపించాడు. టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం ఇండోర్లో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో.. టీ20 క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసిన 11వ భారత బౌలర్గా అక్షర్ పటేల్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇండియా తరపున 52 టీ20 మ్యాచ్లు…
Rishabh Pant, Axar Patel Visits Tirupati Balaji Temple Today: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ ఇద్దరు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఆలయ అధికారులు పంత్, అక్షర్కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం…
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు వన్డే ప్రపంచకప్-2023లో ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్ జట్టులోకి వచ్చే మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు..
Rohit Sharma Talks About India Squad for ODI World Cup 2023: నాణ్యమైన జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భారత జట్టు గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్లో బలహీన బ్యాటింగ్తో సమస్య ఎదుర్కొంటోందని, 8-9వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేసేవారు పరుగులు చేయడం అవసరమన్నాడు. జట్టు సమతూకం కోసమే శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్లను తీసుకున్నామని రోహిత్ తెలిపాడు. ఐసీసీ వన్డే…
Shubman Gill, Ishan Kishan, Axar Patel and Mukesh Kumar Gets a Place in All Three Formats: వెస్టిండీస్ పర్యటనకు ఇప్పటికే టెస్ట్, వన్డేలకు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టీ20లకు కూడా ఎంపిక చేసింది. బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు యువ జట్టుని ఎంపిక చేశారు. దాంతో మూడు సిరీస్ల కోసం జట్ల ఎంపిక పూర్తయింది. బీసీసీఐ సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. వెస్టిండీస్…