Assam Flood : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అస్సాం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 24 లక్షల మందికి పైగా ప్రజలు ప్రస్తుతం వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
Nepal: నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు అక్కడి పోలీసులు ఆదివారం తెలిపారు.
గత నెల రోజులుగా అసోంలో తీవ్ర వరదల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ప్రజల మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి.
Assam Flood: అసోంలో వరదల కారణంగా అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. గురువారం మరో ఆరుగురు మరణించారు. వీరిలో నలుగురు గోలాఘాట్కు చెందినవారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగఢ్, చరైడియో నుండి వచ్చారు.
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. 1,275 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది. దీంతో 6.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు 72 సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్కి చెందిన మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేశారని అన్నారు.
Assam Rains: అస్సాంలో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు బురదగా మారాయి. కోపిలి నది ప్రమాద స్థాయిని దాటుతోంది. ముందుగా 470 గ్రామాలు జలమయమయ్యాయి , మరియు 161,000 మంది నిరాశ్రయులు అయ్యారు . వేల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి . ప్రస్తుతం, 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మరియు 5,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. రెస్క్యూ సిబ్బంది శరణార్థులకు రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా, 16 జిల్లాల్లో వరదలు…
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.
భార్య చనిపోవడంతో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్లో.. 'ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు.…