Assam Floods: వరదలతో అస్సాం విలవిల.. 30 మందికి పైగా మృతి
- అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు
- ఇప్పటివరకు వరదల కారణంగా 30 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Floods: అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. గైనచోర గ్రామంలో మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. అస్సాంలో మేలో రెమాల్ తుఫాను వల్ల కొండచరియలు విరిగిపడ పలువురు మరణించగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 30కి చేరుకుంది.
Read Also: Canada: మరోసారి కవ్వింపు చర్యలు.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కు కెనడా పార్లమెంట్ నివాళి
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
“గత రాత్రి 12.45 గంటలకు, బదర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గైనచోరా (బెందర్గూల్) గ్రామ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న బదర్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి, సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటల తర్వాత రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసింది” అని కరీంగంజ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పార్థ ప్రోతిమ్ దాస్ తెలిపారు. మృతులను రోయ్మున్ నెస్సా (55), ఆమె కుమార్తెలు సాహిదా ఖానం (18), జాహిదా ఖానం (16), హమిదా ఖానం (11)గా గుర్తించారు. మూడేళ్ల బాలుడిని మహిముద్దీన్ కుమారుడు మెహదీ హసన్గా గుర్తించారు.
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం, కరీంగంజ్ అత్యంత ప్రభావితమైన జిల్లా. 1,52,133 మంది వరదనీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విపత్తు వల్ల 1,378.64 హెక్టార్ల మొత్తం పంట విస్తీర్ణం, 54,877 జంతువులను ప్రభావితం చేసింది. ప్రస్తుతం 24 రెవెన్యూ సర్కిళ్లలో 470 గ్రామాలు నీట మునిగాయి. 43 సహాయ శిబిరాల్లో 5,114 మంది ఆశ్రయం పొందడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ, కట్టలు, రోడ్లు, వంతెనలతో సహా మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినందున సహాయం అందించడంతో ఇబ్బంది కలుగుతోంది. కంపూర్ వద్ద కోపిలి నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నందున మరింత ఉప్పొంగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో బిస్వనాథ్, లఖింపూర్, హోజాయ్, బొంగైగావ్, నల్బరీ, తముల్పూర్, ఉదల్గురి, దర్రాంగ్, ధేమాజీ, హైలాకండి, కరీంనగర్, గోల్పరా, నాగావ్, చిరాంగ్ మరియు కోక్రాఝర్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!