Assam Flood : అస్సాంలో వరద బీభత్సం.. ఇప్పటివరకు 125 వన్యప్రాణులు మృతి
- అస్సాంలో వరద బీభత్సం
- పొంగి పొర్లుతున్న బ్రహ్మపుత్రా నది
- మృత్యువాత పడుతున్న వన్యప్రాణులు
Assam Flood : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అస్సాం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 24 లక్షల మందికి పైగా ప్రజలు ప్రస్తుతం వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో వరదల వల్ల మనుషులే కాదు మూగ జంతువులు కూడా దెబ్బతిన్నాయి. పెంపుడు జంతువులతో పాటు వన్యప్రాణులు కూడా వరదల్లో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు 125 వన్యప్రాణులు చనిపోయాయి. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడం వల్ల ఇతర జిల్లాలతో పాటు ప్రపంచ వారసత్వ కేంద్రంగా పిలువబడే కజిరంగా నేషనల్ పార్క్ను వరద చుట్టుముట్టింది. ఆదివారం నాటికి నాలుగు రోజులు గడిచినా కజిరంగాలో వరద పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ప్రస్తుతం 60కి పైగా అటవీ శిబిరాలు వరదల్లో మునిగిపోయాయి. నేషనల్ పార్క్లోని అడవి జంతువులు ఆహారం, సురక్షితమైన స్థలం కోసం అక్కడక్కడ తిరుగుతున్నాయి.
Read Also: OnePlus Nord 4 : భారత్ మార్కెట్ లోకి రానున్న ” వన్ ప్లస్ నోర్డ్ 4 “.. ఫీచర్లు ఇలా..
Also Read
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
- Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
125జంతువులు మృతి
అడవి ఏనుగులు వరదల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎత్తైన ప్రదేశాలను వెతుకుతూ జాతీయ రహదారిని దాటి కర్బీ అంగ్లాంగ్ కొండల వైపు వెళ్తున్నాయి. ఏనుగులే కాదు, అస్సాం గౌరవ్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం కూడా ఎత్తైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ జాతీయ రహదారి 37పై తిరుగుతూ కనిపించింది. కజిరంగా నేషనల్ పార్క్లో మరణించిన 125 జంతువులలో 6 ఒక కొమ్ము గల ఖడ్గమృగం, 90 జింకలు, ఇతర జంతువులు ఉన్నాయి. అటవీ శాఖ 96 జంతువులను రక్షించింది.
Read Also:US Shooting: అమెరికాలో దారుణం.. కాల్పుల్లో ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు
హైవేపై తగ్గిన వాహనాల వేగం
జాతీయ రహదారిని దాటే సమయంలో జంతువుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అస్సాం ప్రభుత్వం హైవే నంబర్ 37లో వాహనాల రాకపోకలకు బ్రేక్ వేసింది. కొన్ని వాహనాల వేగం తగ్గింది. ఆదివారం నాడు అస్సాం ప్రభుత్వ మంత్రి జయంత్ మల్లాబ్ బారువా వరద ప్రభావిత కాజిరంగా జాతీయ భాగాన్ని సందర్శించారు. జాతీయ రహదారులపై డ్రైవ్ స్లో ప్రచారాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!