Assam Flood : అస్సాంలో వరద బీభత్సం.. ఇప్పటివరకు 125 వన్యప్రాణులు మృతి
- అస్సాంలో వరద బీభత్సం
- పొంగి పొర్లుతున్న బ్రహ్మపుత్రా నది
- మృత్యువాత పడుతున్న వన్యప్రాణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Flood : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అస్సాం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 24 లక్షల మందికి పైగా ప్రజలు ప్రస్తుతం వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో వరదల వల్ల మనుషులే కాదు మూగ జంతువులు కూడా దెబ్బతిన్నాయి. పెంపుడు జంతువులతో పాటు వన్యప్రాణులు కూడా వరదల్లో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు 125 వన్యప్రాణులు చనిపోయాయి. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడం వల్ల ఇతర జిల్లాలతో పాటు ప్రపంచ వారసత్వ కేంద్రంగా పిలువబడే కజిరంగా నేషనల్ పార్క్ను వరద చుట్టుముట్టింది. ఆదివారం నాటికి నాలుగు రోజులు గడిచినా కజిరంగాలో వరద పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ప్రస్తుతం 60కి పైగా అటవీ శిబిరాలు వరదల్లో మునిగిపోయాయి. నేషనల్ పార్క్లోని అడవి జంతువులు ఆహారం, సురక్షితమైన స్థలం కోసం అక్కడక్కడ తిరుగుతున్నాయి.
Read Also: OnePlus Nord 4 : భారత్ మార్కెట్ లోకి రానున్న ” వన్ ప్లస్ నోర్డ్ 4 “.. ఫీచర్లు ఇలా..
Also Read
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
125జంతువులు మృతి
అడవి ఏనుగులు వరదల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎత్తైన ప్రదేశాలను వెతుకుతూ జాతీయ రహదారిని దాటి కర్బీ అంగ్లాంగ్ కొండల వైపు వెళ్తున్నాయి. ఏనుగులే కాదు, అస్సాం గౌరవ్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం కూడా ఎత్తైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ జాతీయ రహదారి 37పై తిరుగుతూ కనిపించింది. కజిరంగా నేషనల్ పార్క్లో మరణించిన 125 జంతువులలో 6 ఒక కొమ్ము గల ఖడ్గమృగం, 90 జింకలు, ఇతర జంతువులు ఉన్నాయి. అటవీ శాఖ 96 జంతువులను రక్షించింది.
Read Also:US Shooting: అమెరికాలో దారుణం.. కాల్పుల్లో ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు
హైవేపై తగ్గిన వాహనాల వేగం
జాతీయ రహదారిని దాటే సమయంలో జంతువుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అస్సాం ప్రభుత్వం హైవే నంబర్ 37లో వాహనాల రాకపోకలకు బ్రేక్ వేసింది. కొన్ని వాహనాల వేగం తగ్గింది. ఆదివారం నాడు అస్సాం ప్రభుత్వ మంత్రి జయంత్ మల్లాబ్ బారువా వరద ప్రభావిత కాజిరంగా జాతీయ భాగాన్ని సందర్శించారు. జాతీయ రహదారులపై డ్రైవ్ స్లో ప్రచారాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!