Himanta Biswa Sarma: బంగ్లాకి చెందిన మైనారిటీలు కాంగ్రెస్కి ఓటేశారు.. హిందువులు..
- అభివృద్ధి పనులు చేసినా బంగ్లా మైనారిటీల ఓటు కాంగ్రెస్కే..
- హిందువులు ఎప్పుడూ మతతత్వంలో వ్యవహరించలేదు..
- వచ్చే 10 ఏళ్లలో అస్సాంని కంట్రోల్ చేయడమే వారి లక్ష్యం..
- అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్కి చెందిన మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేశారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వారి కోసం చేసిన అభివృద్ధి పనుల్ని పరిగణలోకి తీసుకోలేదని శనివారం చెప్పారు. అస్సాంలో మతతత్వానికి పాల్పడుతున్న ఏకైక కమ్యూనిటీ ఇదేనని ఆరోపించారు. గౌహతిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిమంత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలైన ఓట్లలో 47 శాతం ఓట్లు బీజేపీ కూటమి సాధిస్తే , కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 39 శాతం ఓట్లు సాధించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 14 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ-ఏజీపీ-యూపీపీఎల్ కూటమి 11 స్థానాలను గెలుచుకోగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్కి వచ్చిన 39 శాతం ఓట్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాలేదని, ఇందులో 50 శాతం మైనారిటీల ప్రాబల్యం ఉన్న 21 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చాయని, ఈ మైనారిటీల ఆధిక్యత ఉన్న సెగ్మెంట్లలో బీజేపీకి 3 శాతం ఓట్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి
హిందువులు మతప్రాతిపదిక ఓట్లు వేయరని ఇది రుజువు చేస్తోందని, అస్సాంలో ఎవరైనా మతతత్వానికి పాల్పడితే, అది ఒకే వర్గం, ఒకే మతం కారణమవుతోందని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి అన్నారు. మైనారిటీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, కరెంట్ లేదని అయినా కూడా కాంగ్రెస్కే ఓట్లు వేశారని చెప్పారు. అస్సామీ ప్రజలు, గిరిజనుల కోసం బీజేపీ పనిచేస్తున్నప్పటీ, ఆ వర్గాలు బీజేపీకి 100 శాతం ఓట్లు వేయలేదని చెప్పారు. కరీంగంజ్ మినహా బంగ్లాదేశ్ మూలాలున్న మైనారిటీ ప్రాంతాల్లో 99 శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయని చెప్పారు.
వారు ప్రధాని మోడీ ఇచ్చిన ఇళ్లలో నివసిస్తున్నారు, మోడీ అందించిన విద్యుత్, పారిశుద్ధ కార్యక్రమాలను పొందుతున్నారు, కానీ ఓటు వేసేటప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారని హిమంత చెప్పారు. రాబోయే 10 ఏళ్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు రాష్ట్రాన్ని నియంత్రించాలనే కోరికతో కాంగ్రెస్కి ఓటేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సదరు కమ్యూనిటీ వారు బ్రార్ పేట్ లోని పోలీస్ స్టేషన్పై దాడికి తెగబడ్డారు, బీజేపీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి ఘటనలు మరెన్ని జరుగుతాయో అని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో 126 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే, 92 స్థానాల్లో బీజేపీనే ప్రజలు ఆదరించినట్లు తెలిపారు. మా లక్ష్యం 47 శాతం ఓట్ల అని, 2026లో 50 శాతం సాధించడమే లక్ష్యమని చెప్పారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!